సంతాన వేణుగోపాలస్వామి స్తోత్ర ఫలితం

కొత్తగా పెళ్లయిన దంపతులు .. తాము తల్లిదండ్రులుగా మారే సమయం కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తుంటారు. అమ్మా .. నాన్న అని పిలిపించుకోవడానికి ఆరాటపడుతుంటారు. సంతానం కలిగే విషయంలో ఆలస్యమవుతున్నా కొద్దీ వాళ్లలో ఆందోళన మొదలవుతూ ఉంటుంది. ఆ దంపతుల కుటుంబ పెద్దలు కూడా ఈ విషయంలో కంగారును వ్యక్తం చేస్తుంటారు .. తమ ఇష్ట దైవానికి మొక్కుకుంటూ వుంటారు. సంతానం కలగడం కోసం యువ దంపతులు కూడా దైవానుగ్రహాన్ని కోరుకుంటూ దేవాలయాలకు వెళుతుంటారు.

అలాంటి దంపతులు 'సంతాన వేణుగోపాలస్వామి'ని ఆశ్రయించడం వలన ఫలితం ఉంటుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. 'సంతాన వేణుగోపాలుడు' ప్రధాన దైవంగా కలిగిన ఆలయాలు ఉంటాయి. ఇక ఆయా క్షేత్రాల్లో ఉపాలయాల్లోను సంతాన వేణుగోపాలస్వామి కొలువై దర్శనమిస్తూ ఉంటాడు. ఆ స్వామిని దర్శించుకోవడం వలన .. అనునిత్యం 'సంతాన వేణుగోపాల స్వామి' స్తోత్రం అత్యంత భక్తి శ్రద్ధలతో పఠించడం వలన ఆశించిన ఫలితం దక్కుతుందని అంటారు. ఇక సంతానం .. ఆరోగ్యంగా ఉండాలంటే తల్లిదండ్రులు గురువారం రోజున ఉపవాసం చేయడం మంచిదని చెబుతారు.     


More Bhakti News