పంచముఖ శివలింగ దర్శనం

పరమశివుడు కొలువైన క్షేత్రాలను దర్శించినప్పుడు, కొన్ని శివలింగాలు ఎంతో విశేషాన్ని సంతరించుకుని కనిపిస్తుంటాయి. అలా ఐదు ముఖాలు గల శివలింగాన్ని కలిగిన క్షేత్రంగా 'జమ్ములపాలెం' కనిపిస్తుంది. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం పరిధిలో ఈ క్షేత్రం విలసిల్లుతోంది.

సాధారణంగ శైవ క్షేత్రాల్లో ఒకటికంటే ఎక్కువగానే శివ లింగాలు కనిపిస్తుంటాయి. అయితే ఈ క్షేత్రంలో ఒక వేయి నూట పదహారు శివలింగాలు ఒక వరుస క్రమంలో దర్శనమిస్తూ ఉంటాయి. ప్రధానమైన శివ లింగం మాత్రం ఐదు ముఖాలను కలిగి ఉంటుంది. ఇక ఈ శివలింగం గర్భాలయంలో కాకుండా మంటపంలో ఉండటం మరో విశేషం.

ఈ శివలింగానికి అభిషేకాలు చేయించడం వలన అనేక దోషాలు తొలగిపోతాయని చెబుతుంటారు. ఎంతోమంది భక్తులు ఇక్కడికి వచ్చి తమ దోషాలు తొలగిపోవడానికి గాను, అభిషేకాలు చేయిస్తుంటారు. ఇక్కడి అనేక శివలింగాలను ఒక్కసారిగా దర్శించడం వలన, మనసే శివమందిరమైనట్టుగా అనిపిస్తుంది .. సదా సదాశివుడి ధ్యానంలో వుండిపోవాలనిపిస్తుంది.


More Bhakti News