విజయాలను ప్రసాదించే విశిష్ట క్షేత్రం

కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణుడు 'పార్థసారధి' గా కీలకమైన పాత్రను పోషించాడు. అంతిమవిజయం ధర్మానిదే అనే విషయాన్ని లోకానికి చాటిచెప్పాడు. పార్థసారధిగా శ్రీకృష్ణుడు నిర్వహించిన పాత్రను ... నిర్వర్తించిన బాధ్యతను ఎవరూ ఎప్పటికీ మరిచిపోలేరు. శ్రీకృష్ణుడి ఆలయాలకు వెళ్లిన భక్తులు ఆయన లీలావిశేషాలను తలచుకోకుండా ఉండలేరు.

ఈ నేపథ్యంలో పార్థసారధి పేరుతో ఆయన కొలువైన క్షేత్రాలు చాలా తక్కువగా కనిపిస్తుంటాయి. అలా ఆ స్వామి పార్థసారధి పేరుతో కొలువైన అరుదైన క్షేత్రాల్లో ఒకటి 'వడ్డాది మాడుగుల' లో కనిపిస్తుంది. విశాఖ జిల్లా పరిధిలోగల ఈ క్షేత్రంలో పార్థసారధి పేరుతో స్వామి పూజాభిషేకాలు అందుకుంటూ వుంటాడు. కొండపై గల ఈ క్షేత్రం ప్రశాంతతను ... పవిత్రతను సంతరించుకుని ఆధ్యాత్మిక కేంద్రంగా అలరారుతోంది.

స్వామివారు కొలువైన తీరు గురించీ ... ఆయన చూపుతోన్న మహిమలను గురించి ఆసక్తికరమైన కథనాలు వినిపిస్తుంటాయి. విశేషమైనటు వంటి రోజుల్లో స్వామివారిని దర్శించుకునే భక్తుల సంఖ్య ఎక్కువగా వుంటుంది. ఇక్కడి స్వామివారిని దర్శించుకోవడం వలన కష్టాలు తొలగిపోతాయనీ ... విజయాలు సిద్ధించి శుభాలు చేకూరతాయని చెబుతుంటారు.


More Bhakti News