ఆదిదంపతుల ఆరాధనా ఫలితం !

వివాహానికి తగిన వయసు రాగానే ప్రతి యువతీ కూడా తన మనసుకి నచ్చినవాడినే చేసుకోవాలని నిర్ణయించుకుంటూ వుంటుంది. తనకి భర్తగా రానున్న వ్యక్తి తన అలవాట్లను ... అభిరుచులను గౌరవించాలని కోరుకుంటుంది. అందమైన జీవితాన్ని ఆనందంగా గడపాలని ఆశపడుతుంది. తల్లిదండ్రులను విడిచి వచ్చిన లోటు తెలియకుండా తనపట్ల ప్రేమానురాగాలను చూపాలని కోరుకుంటుంది.

ఆదర్శవంతమైన వ్యక్తిత్వంతో ఉన్నతమైన స్థానంలో అతను వుండాలని అనుకుంటుంది. ఇలా వివాహానికి సిద్ధమైన యువతులు తనకి భర్తగా రానున్న వ్యక్తిని గురించి కలలు కంటూ వుంటారు. వాళ్ల కలలు నిజం చేసేది ... ఆశలు ఫలించేలా చేసేది 'సువర్ణగౌరీ వ్రతం' అని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. 'భాద్రపద శుద్ధ తదియ' రోజున ఈ వ్రతాన్ని ఆచరిస్తూ వుంటారు.

సాక్షాత్తు పార్వతీదేవి ఈ వ్రతాన్ని ఆచరించి ... ఈ వ్రత ఫలితం కారణంగానే శివుడిని భర్తగా పొందడం జరిగిందని ఆధ్యాత్మిక గ్రంధాలు స్పష్టం చేస్తున్నాయి. అందువలన ఈ రోజున అత్యంత భక్తి శ్రద్ధలతో శివపార్వతులను పూజిస్తూ ఈ వ్రతాన్ని ఆచరిస్తూ వుంటారు. ఈ వ్రత ఫలితంగా గుణవంతుడైనవాడు భర్తగా లభిస్తాడు. ఇక వివాహమైన వారు ఈ వ్రతాన్ని ఆచరించడం వలన వారి సౌభాగ్యం రక్షించబడుతుందని చెప్పబడుతోంది.


More Bhakti News