వెండి శివలింగాన్ని పూజిస్తే కలిగే ఫలితం !

ఆదిదేవుడు తన భక్తులందరికీ అందుబాటులో ఉండటానికీ, అనునిత్యం వాళ్లచే పూజలు అందుకోవడానికే లింగరూపాన్ని ధరించి ఉంటాడని అనిపిస్తుంది. ఈ కారణంగానే సదాశివుడు అనేక ప్రదేశాల్లో లింగరూపంలో దర్శనమిస్తూ వుంటాడు. అశేష భక్త జనకోటిచే నిత్య నీరాజనాలు అందుకుంటూ వుంటాడు.

ఈ నేపథ్యంలో చాలామంది భక్తులు విశేషమైన పర్వదినాల్లో శివాలయాలకు వస్తున్నప్పటికీ, ప్రతిరోజూ ఇంట్లోని పూజా మందిరంలో గల శివలింగాన్ని పూజిస్తూ వుంటారు. పరమశివుడి పట్ల తమకి గల భక్తి విశ్వాసాలకు అనుగుణంగా ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కో రకమైన శివలింగం దర్శనమిస్తూ వుంటుంది. వీటిలో బంగారం ... వెండి ... ఇత్తడి ... పాదరసం వంటి లోహాలతో తయారుచేయబడిన శివలింగాలు ఎక్కువగా కనిపిస్తూ వుంటాయి.

ఈ శివలింగాలలో దేని విశిష్టత దానిదేనని చెప్పవచ్చు ... ఒక్కో లోహంతో చేయబడిన శివలింగాన్ని పూజించడం వలన ఒక్కో విశేష ఫలితం ఉంటుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. వెండితో తయారుచేయబడిన శివలింగం విషయానికి వస్తే, ఈ శివలింగాన్ని పూజించడం వలన ధనధాన్యాలు వృద్ధి చెందుతాయని చెప్పబడుతోంది.

ధనధాన్యాలు దారిద్ర్యంతో కూడినటువంటి దుఃఖాన్ని దూరం చేస్తాయి ... సుఖసంతోషాలకు చేరువచేస్తాయి. అందువలన ఆనందకరమైన జీవితాన్ని ఆశించే వాళ్లు వెండితో తయారుచేయబడిన శివలింగాన్ని పూజించాలనే విషయాన్ని మరిచిపోకూడదు.


More Bhakti News