Hurun Report: భారత్లో పెరిగిన బిలియనీర్ల సంఖ్య... ప్రపంచంలో మన స్థానం ఎంతంటే...!
- ప్రపంచంలో అత్యధిక బిలియనీర్లు ఉన్న మూడో దేశంగా భారత్
- గతేడాదితో పోలిస్తే కొత్తగా చేరిన మరో 24 మంది కుబేరులు
- ఏకంగా రూ.112.6 లక్షల కోట్లకు చేరిన మొత్తం సంపద
- హెల్త్కేర్ రంగం నుంచే అత్యధికంగా కొత్త బిలియనీర్లు
- ఆసియా బిలియనీర్ క్యాపిటల్ హోదాను కోల్పోయిన ముంబై
భారత్లో సంపన్నుల సంఖ్య ఏటా పెరుగుతూనే ఉంది. తాజాగా విడుదలైన 'హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్-2026' ప్రకారం.. ప్రపంచంలో అత్యధిక బిలియనీర్లు ఉన్న దేశాల జాబితాలో భారత్ మూడో స్థానంలో నిలిచింది. అమెరికా, చైనా తర్వాత భారత్ ఈ ఘనత సాధించింది. ప్రస్తుతం దేశంలో మొత్తం 308 మంది బిలియనీర్లు ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. దేశంలో సంపద సృష్టి, ఆర్థిక వృద్ధి బలంగా ఉందని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
గతేడాదితో పోలిస్తే ఈసారి కొత్తగా 24 మంది బిలియనీర్ల జాబితాలో చేరారు. దీంతో భారతీయ కుబేరుల మొత్తం సంపద 10 శాతం పెరిగి రూ.112.6 లక్షల కోట్లకు (112.6 ట్రిలియన్లు) చేరింది. 199 మంది సంపద పెరగ్గా, 109 మంది సంపద తగ్గడం లేదా స్థిరంగా ఉండటం గమనార్హం.
ఈసారి సంప్రదాయ రంగాలకు మించి ఇతర రంగాల వారు కూడా జాబితాలో చోటు దక్కించుకున్నారు. అత్యధికంగా హెల్త్కేర్ రంగం నుంచి 53 మంది, ఇండస్ట్రియల్ గూడ్స్ నుంచి 36 మంది, కన్జ్యూమర్ గూడ్స్ నుంచి 31 మంది కొత్తగా ఈ జాబితాలో చేరారు. అయితే తక్కువ మంది ఉన్నప్పటికీ, ఇంధన రంగం (ఎనర్జీ) అత్యధిక సంపదను కలిగి ఉంది. కేవలం 8 మంది బిలియనీర్లే రూ.18.3 లక్షల కోట్ల సంపదతో దేశీయ కుబేరుల మొత్తం సంపదలో 16 శాతం వాటాను కలిగి ఉన్నారు.
నగరాల వారీగా చూస్తే ముంబై 95 మంది బిలియనీర్లతో దేశంలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. అయితే ఆసియా బిలియనీర్ క్యాపిటల్ హోదాను మాత్రం ముంబై కోల్పోయింది. 133 మంది కుబేరులతో చైనాలోని షెన్జెన్ నగరం ఆసియాలో టాప్ ప్లేస్కు చేరింది. ముంబైలో కొత్తగా 15 మంది బిలియనీర్లు చేరగా, ఇది న్యూయార్క్ (14), లండన్ (9) కంటే ఎక్కువ కావడం విశేషం.
ఇక భారతీయ బిలియనీర్లలో మహిళల వాటా 7 శాతంగా ఉంది. మొత్తం 23 మంది మహిళా కుబేరుల వద్ద రూ.9.8 లక్షల కోట్ల సంపద ఉన్నట్లు హురున్ నివేదిక తెలిపింది. ప్రపంచ సగటు వయసు (65) కంటే భారతీయ బిలియనీర్ల సగటు వయసు (67) ఎక్కువగా ఉండటం గమనార్హం.
గతేడాదితో పోలిస్తే ఈసారి కొత్తగా 24 మంది బిలియనీర్ల జాబితాలో చేరారు. దీంతో భారతీయ కుబేరుల మొత్తం సంపద 10 శాతం పెరిగి రూ.112.6 లక్షల కోట్లకు (112.6 ట్రిలియన్లు) చేరింది. 199 మంది సంపద పెరగ్గా, 109 మంది సంపద తగ్గడం లేదా స్థిరంగా ఉండటం గమనార్హం.
ఈసారి సంప్రదాయ రంగాలకు మించి ఇతర రంగాల వారు కూడా జాబితాలో చోటు దక్కించుకున్నారు. అత్యధికంగా హెల్త్కేర్ రంగం నుంచి 53 మంది, ఇండస్ట్రియల్ గూడ్స్ నుంచి 36 మంది, కన్జ్యూమర్ గూడ్స్ నుంచి 31 మంది కొత్తగా ఈ జాబితాలో చేరారు. అయితే తక్కువ మంది ఉన్నప్పటికీ, ఇంధన రంగం (ఎనర్జీ) అత్యధిక సంపదను కలిగి ఉంది. కేవలం 8 మంది బిలియనీర్లే రూ.18.3 లక్షల కోట్ల సంపదతో దేశీయ కుబేరుల మొత్తం సంపదలో 16 శాతం వాటాను కలిగి ఉన్నారు.
నగరాల వారీగా చూస్తే ముంబై 95 మంది బిలియనీర్లతో దేశంలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. అయితే ఆసియా బిలియనీర్ క్యాపిటల్ హోదాను మాత్రం ముంబై కోల్పోయింది. 133 మంది కుబేరులతో చైనాలోని షెన్జెన్ నగరం ఆసియాలో టాప్ ప్లేస్కు చేరింది. ముంబైలో కొత్తగా 15 మంది బిలియనీర్లు చేరగా, ఇది న్యూయార్క్ (14), లండన్ (9) కంటే ఎక్కువ కావడం విశేషం.
ఇక భారతీయ బిలియనీర్లలో మహిళల వాటా 7 శాతంగా ఉంది. మొత్తం 23 మంది మహిళా కుబేరుల వద్ద రూ.9.8 లక్షల కోట్ల సంపద ఉన్నట్లు హురున్ నివేదిక తెలిపింది. ప్రపంచ సగటు వయసు (65) కంటే భారతీయ బిలియనీర్ల సగటు వయసు (67) ఎక్కువగా ఉండటం గమనార్హం.