KCR: కేసీఆర్ కు నోటీసులు అందించిన సిట్.. రేపే విచారణ

KCR to Face SIT Inquiry in Phone Tapping Case Tomorrow
  • నంది నగర్ లోని నివాసంలో నోటీసులు అందించిన సిట్
  • విచారణకు పీఎస్ కు రావాల్సిన అవసరం లేదన్న సిట్ అధికారులు
  • ప్లేస్ చెబితే తామే అక్కడకు వస్తామని వెల్లడి
తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు అందాయి. హైదరాబాద్ లోని నందినగర్ లో ఉన్న కేసీఆర్ నివాసానికి వెళ్లిన సిట్ అధికారులు నోటీసులు అందించారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు విచారణ జరుపుతామని నోటీసుల్లో సిట్ అధికారులు పేర్కొన్నారు. 

కేసీఆర్ వయసు దృష్ట్యా విచారణ కోసం పోలీస్ స్టేషన్ కు రావాల్సిన అవసరం లేదని సిట్ తెలిపింది. హైదరాబాద్ నగర పరిధిలోని ఏదైనా ప్రాంతం వివరాలను తెలిపితే... అక్కడకే వచ్చి విచారణ జరుపుతామని పేర్కొంది. ఇప్పటికే ఈ కేసులో కేటీఆర్, హరీశ్ రావు, సంతోష్ కుమార్ లను సిట్ విచారించింది. మళ్లీ అవసరమైతే విచారణకు పిలుస్తామని వారికి తెలియజేసింది. ఇప్పుడు గులాబీ బాస్ ను విచారణకు పిలవడంతో ఆ పార్టీలో ఉత్కంఠ నెలకొంది. రాబోయే రోజుల్లో ఈ కేసులో మరెన్ని మలుపులు చోటుచేసుకుంటాయో అనే ఆసక్తి సర్వత్ర నెలకొంది.
KCR
KCR phone tapping case
Telangana phone tapping
BRS party
Telangana politics
SIT investigation
KT Rama Rao
Harish Rao
Santosh Kumar

More Telugu News