Chandrababu Naidu: హంద్రీ-నీవా నుంచి నీటి తరలింపులో సరికొత్త రికార్డ్... చంద్రబాబుకు థ్యాంక్స్ చెప్పిన మంత్రులు
- హంద్రీ-నీవా నుంచి రాయలసీమకు తొలిసారిగా 40 టీఎంసీల నీటి తరలింపు
- కేవలం 190 రోజుల్లోనే డిజైన్డ్ కెపాసిటీని మించిన ప్రవాహం
- సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపిన రాయలసీమ మంత్రులు
- మరో 10 టీఎంసీలు తరలించి 50 టీఎంసీల రికార్డుకు సీఎం ఆదేశం
- సీమలోని అన్ని చెరువులు నింపడమే లక్ష్యమని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి
రాయలసీమ సాగునీటి చరిత్రలో హంద్రీ-నీవా సుజల స్రవంతి ప్రాజెక్టు ఓ సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. ప్రాజెక్టు చరిత్రలో తొలిసారిగా 40.109 టీఎంసీల నీటిని రాయలసీమ జిల్లాలకు తరలించి ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ అరుదైన రికార్డును నెలకొల్పింది. కేవలం 190 రోజుల్లోనే ప్రాజెక్టు డిజైన్డ్ కెపాసిటీని మించి ఈ స్థాయిలో నీటిని తరలించడం గమనార్హం. ఈ చారిత్రక ఘట్టం నేపథ్యంలో, రాయలసీమకు చెందిన మంత్రులు పయ్యావుల కేశవ్, బీసీ జనార్దన్ రెడ్డి, రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుచూపు, పక్కా ప్రణాళిక వల్లే ఇది సాధ్యమైందని కొనియాడారు. గతంలో కేవలం ఒక పంపుతో నీటిని తీసుకునే పరిస్థితి ఉండేదని, టీడీపీ హయాంలోనే 6 పంపులకు సామర్థ్యం పెంచగా, ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాన్ని 12 పంపులకు పెంచిందని మంత్రి పయ్యావుల కేశవ్ గుర్తుచేశారు. కేవలం 100 రోజుల్లోనే హంద్రీ-నీవా కాల్వల వెడల్పు పనులు పూర్తి చేయడం కూడా మరో రికార్డని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు.
హంద్రీ-నీవాలో భాగమైన మచ్చుమర్రి ప్రాజెక్టు నిర్మాణం ఒక మేలిమలుపు అని, దాని వల్లే నేడు ఈ సత్ఫలితాలు సాధ్యమయ్యాయని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వివరించారు. సీఎం చంద్రబాబు నిరంతర పర్యవేక్షణతోనే ఇది సాకారమైందని మంత్రులు పేర్కొన్నారు.
అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. ఈ రికార్డుతో సంతృప్తి చెందవద్దని, మరో మైలురాయిని అందుకోవాలని అధికారులను ఆదేశించారు. హంద్రీ-నీవా ద్వారా 50 టీఎంసీల వరకు నీటిని తరలించి రాయలసీమలోని ప్రతి చెరువు, రిజర్వాయర్ను నింపాలని స్పష్టం చేశారు. అన్ని జలాశయాలు నిండినప్పుడే తనకు నిజమైన సంతోషమని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఫిబ్రవరి నెలాఖరు లేదా మార్చి మొదటి వారంలోగా అదనంగా మరో 10 టీఎంసీలను తరలించి, మొత్తం 50 టీఎంసీల లక్ష్యాన్ని చేరుకుంటామని మంత్రి నిమ్మల రామానాయుడు ముఖ్యమంత్రికి హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుచూపు, పక్కా ప్రణాళిక వల్లే ఇది సాధ్యమైందని కొనియాడారు. గతంలో కేవలం ఒక పంపుతో నీటిని తీసుకునే పరిస్థితి ఉండేదని, టీడీపీ హయాంలోనే 6 పంపులకు సామర్థ్యం పెంచగా, ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాన్ని 12 పంపులకు పెంచిందని మంత్రి పయ్యావుల కేశవ్ గుర్తుచేశారు. కేవలం 100 రోజుల్లోనే హంద్రీ-నీవా కాల్వల వెడల్పు పనులు పూర్తి చేయడం కూడా మరో రికార్డని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు.
హంద్రీ-నీవాలో భాగమైన మచ్చుమర్రి ప్రాజెక్టు నిర్మాణం ఒక మేలిమలుపు అని, దాని వల్లే నేడు ఈ సత్ఫలితాలు సాధ్యమయ్యాయని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వివరించారు. సీఎం చంద్రబాబు నిరంతర పర్యవేక్షణతోనే ఇది సాకారమైందని మంత్రులు పేర్కొన్నారు.
అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. ఈ రికార్డుతో సంతృప్తి చెందవద్దని, మరో మైలురాయిని అందుకోవాలని అధికారులను ఆదేశించారు. హంద్రీ-నీవా ద్వారా 50 టీఎంసీల వరకు నీటిని తరలించి రాయలసీమలోని ప్రతి చెరువు, రిజర్వాయర్ను నింపాలని స్పష్టం చేశారు. అన్ని జలాశయాలు నిండినప్పుడే తనకు నిజమైన సంతోషమని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఫిబ్రవరి నెలాఖరు లేదా మార్చి మొదటి వారంలోగా అదనంగా మరో 10 టీఎంసీలను తరలించి, మొత్తం 50 టీఎంసీల లక్ష్యాన్ని చేరుకుంటామని మంత్రి నిమ్మల రామానాయుడు ముఖ్యమంత్రికి హామీ ఇచ్చారు.