జంగారెడ్డిగూడెంలో గొడ్డలితో నలుగురి మహిళలపై దాడి
ఈ భయానక ఘటనలో జీలుగులమ్మ (47) అనే మహిళ తీవ్ర రక్తస్రావమై ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయింది. నిందితుడి దాడిలో తీవ్రంగా గాయపడిన చుక్కమ్మ, ఉషారాణి, ధనలక్ష్మిలను స్థానికులు వెంటనే జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం.
కుటుంబ సభ్యుల మధ్య ఉన్న చిన్నపాటి తగాదాలు, పొలం సరిహద్దుల (గట్ల) విషయంలో గత కొంతకాలంగా నెలకొన్న వివాదాలే ఈ దారుణానికి దారితీసినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. నిందితుడు వివేక్ పరారీలో ఉన్నట్లు సమాచారం.