తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం.. విద్యార్థులకు ఊరట
- ఇంటర్ పరీక్షలకు 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా అనుమతి
- గతేడాది నిబంధననే ఈసారీ కొనసాగించనున్న ఇంటర్ బోర్డు
- ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు వార్షిక పరీక్షలు
రాష్ట్రవ్యాప్తంగా ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ థియరీ పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలకు 9 లక్షల మందికి పైగా విద్యార్థులు ఫీజులు చెల్లించారు. కాగా, రేపు, ఎల్లుండి ఇంగ్లిష్ ప్రాక్టికల్స్, 23న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్, 24న ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షలు నిర్వహిస్తారు. ఇక, ఫిబ్రవరి 2 నుంచి 21 వరకు ఇతర ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నాయి.