37 ఏళ్ల తర్వాత ఘోర పరాభవం.. కోచ్ గంభీర్‌పై ఫ్యాన్స్ ఫైర్

Gautam Gambhir Faces Fan Fire After India ODI Series Loss
  • కివీస్‌తో వన్డే సిరీస్ 2-1 తేడాతో కోల్పోయిన టీమిండియా
  • విరాట్ కోహ్లీ శతకం వృథా.. 41 పరుగుల తేడాతో మూడో వన్డేలో ఓటమి
  • కోచ్ గౌతమ్ గంభీర్‌పై సోషల్ మీడియాలో అభిమానుల తీవ్ర ఆగ్రహం
  • సంజూ శాంసన్‌ను కాదని గిల్‌ను ఎంపిక చేయడంపై సెలెక్టర్లపై విమర్శలు
స్వదేశంలో భారత క్రికెట్ జట్టుకు భారీ షాక్ తగిలింది. అనుభవం లేని ఆటగాళ్లతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ చేతిలో టీమిండియా వన్డే సిరీస్‌ను కోల్పోయింది. ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో ఆదివారం జరిగిన చివరిదైన మూడో వన్డేలో భారత్ 41 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను న్యూజిలాండ్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. భారత గడ్డపై 37 ఏళ్ల తర్వాత వన్డే సిరీస్‌ను గెలిచి కివీస్ చరిత్ర సృష్టించింది.

ఈ మ్యాచ్‌లో 338 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో విరాట్ కోహ్లీ (124) అద్భుత శతకంతో పోరాడాడు. యువ ఆటగాళ్లు హర్షిత్ రాణా, నితీశ్ కుమార్ రెడ్డి అర్ధశతకాలతో రాణించినా ఫలితం లేకపోయింది. నిర్ణీత ఓవర్లలో జట్టు లక్ష్యానికి 41 పరుగుల దూరంలో నిలిచిపోయింది. గత ఏడాది టెస్టు సిరీస్‌లోనూ వైట్‌వాష్ అయిన భారత్, ఇప్పుడు వన్డే సిరీస్ కూడా కోల్పోవడంతో అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఓటమిపై సోషల్ మీడియా వేదికగా అభిమానులు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యంగా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌ను లక్ష్యంగా చేసుకుని పోస్టులు పెడుతున్నారు. "అనుభవం లేని కివీస్ జట్టు, బలమైన భారత జట్టును ఓడించడం గంభీర్ హయాంలోనే సాధ్యం" అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. మరోవైపు, మాజీ క్రికెటర్ వసీం జాఫర్ స్పందిస్తూ.. యువ కివీస్ జట్టు అద్భుతంగా ఆడిందని ప్రశంసించారు. కుల్దీప్ యాదవ్ ప్రదర్శన, సంజూ శాంసన్ స్థానంలో శుభ్‌మన్ గిల్‌ను ఎంపిక చేయడం వంటి అంశాలపై కూడా సెలెక్టర్లపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Go Back to Shorts
Gautam Gambhir
India vs New Zealand
India
New Zealand
ODI Series
Cricket
Virat Kohli
Harshit Rana
Nitish Kumar Reddy
Wasim Jaffer

More Telugu News