Nirmala Sitharaman: ఫిబ్రవరి 1 ఆదివారం కేంద్ర బడ్జెట్ ప్రకటన... కీలక నిర్ణయం తీసుకున్న స్టాక్ మార్కెట్లు
- కేంద్ర బడ్జెట్ 2026 కారణంగా ఆదివారం కూడా పనిచేయనున్న స్టాక్ మార్కెట్లు
- ఫిబ్రవరి 1న యథావిధిగా ఉదయం 9:15 నుంచి 3:30 వరకు ట్రేడింగ్
- 2000 సంవత్సరం తర్వాత ఆదివారం బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి
- జనవరి 28 నుంచి ఏప్రిల్ 2 వరకు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
కేంద్ర బడ్జెట్ 2026-27 నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు కీలక నిర్ణయం తీసుకున్నాయి. బడ్జెట్ ప్రవేశపెట్టే రోజైన ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం అయినప్పటికీ, ఆ రోజున యథావిధిగా ట్రేడింగ్ నిర్వహించనున్నట్లు బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) ప్రకటించాయి. ఈ మేరకు శుక్రవారం ప్రత్యేక సర్క్యులర్లను జారీ చేశాయి.
ఫిబ్రవరి 1న ఉదయం 9:15 గంటల నుంచి మధ్యాహ్నం 3:30 గంటల వరకు సాధారణ ట్రేడింగ్ సెషన్ జరుగుతుందని ఎన్ఎస్ఈ తన సర్క్యులర్లో పేర్కొంది. ఈక్విటీ సెగ్మెంట్తో పాటు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (F&O), కమోడిటీ డెరివేటివ్స్ విభాగాల్లోనూ ట్రేడింగ్ ఉంటుందని స్పష్టం చేసింది. అయితే, టి+0 సెటిల్మెంట్ సెషన్, ఆక్షన్ సెషన్ మాత్రం ఆ రోజు ఉండవని బీఎస్ఈ తెలిపింది.
సాధారణంగా శని, ఆదివారాల్లో స్టాక్ మార్కెట్లకు సెలవు ఉంటుంది. అయితే, బడ్జెట్ వంటి కీలక ఘట్టం కారణంగా ఈ ప్రత్యేక ఏర్పాటు చేశారు. 2000 సంవత్సరం తర్వాత బడ్జెట్ను ఆదివారం ప్రవేశపెట్టడం ఇదే మొదటిసారి. గతంలో 2015, 2025 బడ్జెట్లను శనివారాల్లో ప్రవేశపెట్టినప్పుడు కూడా మార్కెట్లను తెరిచే ఉంచారు.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 28న ప్రారంభమై ఏప్రిల్ 2 వరకు రెండు విడతలుగా కొనసాగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. జనవరి 30న ఆర్థిక సర్వేను పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా వెల్లడించిన ప్రకారం, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న ఉదయం 11 గంటలకు బడ్జెట్ను ప్రవేశపెడతారు.
ఫిబ్రవరి 1న ఉదయం 9:15 గంటల నుంచి మధ్యాహ్నం 3:30 గంటల వరకు సాధారణ ట్రేడింగ్ సెషన్ జరుగుతుందని ఎన్ఎస్ఈ తన సర్క్యులర్లో పేర్కొంది. ఈక్విటీ సెగ్మెంట్తో పాటు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (F&O), కమోడిటీ డెరివేటివ్స్ విభాగాల్లోనూ ట్రేడింగ్ ఉంటుందని స్పష్టం చేసింది. అయితే, టి+0 సెటిల్మెంట్ సెషన్, ఆక్షన్ సెషన్ మాత్రం ఆ రోజు ఉండవని బీఎస్ఈ తెలిపింది.
సాధారణంగా శని, ఆదివారాల్లో స్టాక్ మార్కెట్లకు సెలవు ఉంటుంది. అయితే, బడ్జెట్ వంటి కీలక ఘట్టం కారణంగా ఈ ప్రత్యేక ఏర్పాటు చేశారు. 2000 సంవత్సరం తర్వాత బడ్జెట్ను ఆదివారం ప్రవేశపెట్టడం ఇదే మొదటిసారి. గతంలో 2015, 2025 బడ్జెట్లను శనివారాల్లో ప్రవేశపెట్టినప్పుడు కూడా మార్కెట్లను తెరిచే ఉంచారు.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 28న ప్రారంభమై ఏప్రిల్ 2 వరకు రెండు విడతలుగా కొనసాగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. జనవరి 30న ఆర్థిక సర్వేను పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా వెల్లడించిన ప్రకారం, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న ఉదయం 11 గంటలకు బడ్జెట్ను ప్రవేశపెడతారు.