అమెరికాలో కాల్పుల కలకలం.. ఆరుగురి మృతి
- ఈస్టర్న్ మిసిసిపీలోని వెస్ట్ పాయింట్ పట్టణ పరిసరాల్లో మూడు వేర్వేరు ప్రాంతాల్లో కాల్పులు
- నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
- ప్రస్తుతం సమాజానికి ఎలాంటి ముప్పు లేదని అధికారుల ప్రకటన
దాదాపు 20 వేల జనాభా కలిగిన క్లే కౌంటీలో ఈ దారుణం చోటుచేసుకుంది. గతేడాది అక్టోబర్లో కూడా మిసిసిపీలో ఇలాంటి కాల్పుల ఘటనలు జరిగాయి. అప్పట్లో లేల్యాండ్ నగరంలో జరిగిన దాడిలో ఆరుగురు మరణించగా, 12 మంది గాయపడ్డారు. తాజా ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.