కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర అసహనం
- పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సమయంలో లాబీల్లో తిరిగిన ఎమ్మెల్యేలు
- కీలక అంశంపై ప్రజెంటేషన్ ఇస్తుంటే ఇలా వ్యవహరించడం సరైనది కాదన్న సీఎం
- అధికార పార్టీ ఎమ్మెల్యేలు తప్పనిసరిగా సభలో ఉండాలన్న ముఖ్యమంత్రి
ప్రభుత్వం ఒక కీలక అంశంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరిస్తుంటే ఎమ్మెల్యేలు సభలో లేకపోవడం సరైన పద్ధతి కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇలా వ్యవహరిస్తే ప్రభుత్వ ప్రతిష్ఠ దెబ్బతింటుందని అన్నారు. ప్రజలు సమావేశాలను గమనిస్తుంటారని, కాబట్టి ఎమ్మెల్యేలు అత్యంత బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు. ఎమ్మెల్యేలు సభలో లేకపోవడం పార్టీ క్రమశిక్షణకు విరుద్ధమని ఆయన అన్నారు.
ప్రభుత్వ విధానాలు, కార్యక్రమాలపై చర్చ జరుగుతున్నప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యేలు తప్పనిసరిగా సభలో ఉండాలని సూచించారు. ఎమ్మెల్యేలందరినీ సభలోకి పిలిపించాలని కాంగ్రెస్ విప్లను ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చూసుకోవాలని హితవు పలికారు.