Republic Day India: గణతంత్ర వేడుకల్లో హిస్టారికల్ ప్రారంభం.. తొలిసారి ఆర్మీ జంతు బృందం కవాతు

Republic Day India Animal Contingent to Debut in Parade
  • జనవరి 26న గణతంత్ర వేడుకలో యానిమల్ కంటిజెంట్
  • కవాతులో ఒంటెలు, గొర్రాలు, డేగలు, ఆర్మీ జాగిలాలు
  • కవాతు బృందంలో భద్రత కోసం సైనికులు ఉపయోగించే జంతువులు
ఢిల్లీలోని కర్తవ్య్‌పథ్‌లో వచ్చే సంవత్సరం జనవరి 26న నిర్వహించనున్న గణతంత్ర వేడుకల కవాతులో తొలిసారి యానిమల్ కంటింజెంట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ కవాతులో రెండు ఒంటెలు, నాలుగు గుర్రాలు, నాలుగు డేగలు, పది స్వదేశీ ఆర్మీ జాగిలాలు, ఇప్పటికే సేవల్లో ఉన్న మరో ఆరు జాగిలాలు ఈ బృందంలో ఉండనున్నాయి.

రీమౌంట్ అండ్ వెటర్నరీ కార్ప్స్ (ఆర్వీసీ) విభాగానికి చెందిన శిక్షణ పొందిన జంతువులను ఈ కవాతులో ప్రదర్శించనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. దేశంలోనే అత్యంత సవాళ్లతో కూడిన సరిహద్దుల వద్ద భద్రత కోసం సైనికులు ఉపయోగించే జంతువులు ఈ బృందంలో ఉన్నాయి.

లడఖ్‌లోని శీతల ఎడారులలో కార్యకలాపాల కోసం ఇటీవల చేరిన బాక్ట్రియన్ ఒంటెలు ఈ కవాతులో నాయకత్వం వహించనున్నాయి. విపరీతమైన చలి, 15,000 అడుగుల కంటే ఎత్తులో అసాధారణ పరిస్థితుల్లో ఈ ఒంటెలు 250 కిలోల వరకు బరువును మోయగలవు. అదే సమయంలో తక్కువ నీరు, ఆహారంతో ఎక్కువ దూరం కూడా ప్రయాణించగలవు.
Republic Day India
Animal Contingent
Kartavya Path
Indian Army
Camel Contingent
Dog Squad

More Telugu News