BEST Bus: ముంబైలో ఘోర ప్రమాదం: పాదచారులపైకి దూసుకెళ్లిన 'బెస్ట్' బస్సు.. నలుగురి మృతి!

Mumbai BEST Bus Accident Four Dead Nine Injured
షార్ట్స్‌లో చూడండి
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో సోమవారం రాత్రి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నగర ప్రజా రవాణా వ్యవస్థ అయిన 'బెస్ట్' బస్సు అదుపుతప్పి పాదచారులపైకి దూసుకెళ్లడంతో నలుగురు ప్రాణాలు కోల్పోగా, తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. భాండూప్ ప్రాంతంలోని స్టేషన్ రోడ్డు సమీపంలో రాత్రి 10 గంటల సమయంలో జరిగిందీ ఘటన.

పోలీసుల కథనం ప్రకారం.. బస్సు తన రూట్ ముగించుకుని చివరి పాయింట్ వద్ద రివర్స్ తీసుకుంటున్న సమయంలో డ్రైవర్ ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయాడు. దీంతో వెనుక ఉన్న పాదచారులను బస్సు బలంగా ఢీకొట్టింది. ప్రమాద సమయంలో సంతోష్ రమేశ్ సావంత్ (52) డ్రైవర్‌గా, భగవాన్ భౌ ఘారే (47) కండక్టర్‌గా విధుల్లో ఉన్నారు. ఘటన జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఇది అత్యంత దురదృష్టకరమైన సంఘటన అని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ప్రభుత్వం తరపున ఒక్కో కుటుంబానికి రూ. 5 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బస్సులో ఏదైనా సాంకేతిక లోపం ఉందా? లేక డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదం జరిగిందా? అనే కోణంలో విచారిస్తున్నారు.
Go Back to Shorts
BEST Bus
Mumbai accident
Road accident
Maharashtra
Devendra Fadnavis
Santosh Ramesh Sawant
Bhagwan Bhau Ghare
Bus accident India
Mumbai news
India road safety

More Telugu News