ఇండిగో ప్రయాణికులకు రూ.827 కోట్ల రిఫండ్
- మిగిలిన వారికి డిసెంబర్ 15 లోగా చెల్లింపులు జరుపుతామని వెల్లడి
- డిసెంబర్ 1 నుంచి 7 వరకు 5,86,705 టిక్కెట్లు రద్దు
- రూ.570 కోట్లు ప్రయాణికులకు అందినట్లు ప్రకటన
విమానాల సర్వీసుల రద్దు వల్ల వివిధ విమానాశ్రయాల్లో దాదాపు 9,000 బ్యాకేజీలు నిలిచిపోయినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వాటిలో 4,500 బ్యాగులను ఇప్పటికే ప్రయాణికులకు అందజేసినట్లు తెలిపింది. వచ్చే 36 గంటల్లో మిగిలిన వాటిని డెలివరీ చేసేందుకు ఇండిగో ఏర్పాటు చేస్తోంది. సోమవారం మొత్తం 500 సర్వీసులు రద్దయ్యాయని వెల్లడించింది.
ఇదిలా ఉండగా, సర్వీసుల పునరుద్ధరణను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు తమ మాతృసంస్థ ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ ప్రత్యేకంగా ఒక క్రైసిస్ మేనేజ్మెంట్ గ్రూప్ను ఏర్పాటు చేసినట్లు ఇండిగో తెలిపింది. డిసెంబర్ 4న జరిగిన బోర్డు సమావేశంలో దీని ఏర్పాటుపై నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.