Buddha Venkanna: పరకామణి నిందితుడిని హత్య చేయిస్తారేమో: బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు
- పరకామణి నిందితుడు రవికుమార్ను జగన్ వెనకేసుకొస్తున్నారని వ్యాఖ్య
- నిజాలు బయటపడతాయని రవికుమార్ను హత్య చేస్తారేమోనని అనుమానం
- చంద్రబాబు కుటుంబంపై జగన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన వెంకన్న
తిరుమల పరకామణి కేసు వ్యవహారంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నారన్న అభియోగాలు ఎదుర్కొంటున్న జగన్కు పరకామణి దొంగతనం ఒక చిన్న తప్పేమోనని ఆయన ఎద్దేవా చేశారు. నిందితుడు రవికుమార్ స్వయంగా తాను పెద్ద తప్పు చేశానని ఒప్పుకున్నా, జగన్ మాత్రం అతడిని వెనకేసుకు రావడం విడ్డూరంగా ఉందని విమర్శించారు.
"రవికుమార్ను జగన్ ఎందుకు కాపాడుతున్నాడు? గతంలో ఆయన తిరుమలకు వెళ్లింది భక్తితో కాదు, రవికుమార్ వివాదాన్ని అడ్డం పెట్టుకుని దోచుకోవడానికే" అని బుద్దా వెంకన్న ఆరోపించారు. ఈ వ్యవహారంలో తాడేపల్లి ప్యాలెస్లో సెటిల్మెంట్ జరిగిందని, ఇప్పుడు తన విషయం బయటకు వస్తుందనే భయంతో రవికుమార్ను హత్య చేయిస్తారేమోనన్న అనుమానాలు కూడా ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. రవికుమార్ నుంచి ఎవరెవరు ఎంత ఆస్తులు రాయించుకున్నారో తేలాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులపై జగన్ చేస్తున్న విమర్శలపైనా బుద్దా వెంకన్న మండిపడ్డారు. "మీ భార్య భారతి గారిలా, భువనేశ్వరి గారు రాజకీయాల్లో లేరు. మీ కుటుంబంలా వారు అక్రమంగా దోచుకోలేదు" అని అన్నారు. బాబాయ్ని చంపిన వారిని పక్కన పెట్టుకుని, ఆస్తి కోసం తల్లిని, చెల్లిని బయటకు గెంటేసిన చరిత్ర జగన్దని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
పరకామణి కేసుకు సంబంధించి పూర్తిస్థాయి విచారణ జరుగుతోందని, తాడేపల్లి ప్యాలెస్తో ఉన్న లింకులు త్వరలోనే బయటపడతాయని హెచ్చరించారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసిన జగన్, ప్రజలకు మోకాళ్లపై కూర్చుని క్షమాపణ చెప్పాలని బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు.
"రవికుమార్ను జగన్ ఎందుకు కాపాడుతున్నాడు? గతంలో ఆయన తిరుమలకు వెళ్లింది భక్తితో కాదు, రవికుమార్ వివాదాన్ని అడ్డం పెట్టుకుని దోచుకోవడానికే" అని బుద్దా వెంకన్న ఆరోపించారు. ఈ వ్యవహారంలో తాడేపల్లి ప్యాలెస్లో సెటిల్మెంట్ జరిగిందని, ఇప్పుడు తన విషయం బయటకు వస్తుందనే భయంతో రవికుమార్ను హత్య చేయిస్తారేమోనన్న అనుమానాలు కూడా ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. రవికుమార్ నుంచి ఎవరెవరు ఎంత ఆస్తులు రాయించుకున్నారో తేలాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులపై జగన్ చేస్తున్న విమర్శలపైనా బుద్దా వెంకన్న మండిపడ్డారు. "మీ భార్య భారతి గారిలా, భువనేశ్వరి గారు రాజకీయాల్లో లేరు. మీ కుటుంబంలా వారు అక్రమంగా దోచుకోలేదు" అని అన్నారు. బాబాయ్ని చంపిన వారిని పక్కన పెట్టుకుని, ఆస్తి కోసం తల్లిని, చెల్లిని బయటకు గెంటేసిన చరిత్ర జగన్దని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
పరకామణి కేసుకు సంబంధించి పూర్తిస్థాయి విచారణ జరుగుతోందని, తాడేపల్లి ప్యాలెస్తో ఉన్న లింకులు త్వరలోనే బయటపడతాయని హెచ్చరించారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసిన జగన్, ప్రజలకు మోకాళ్లపై కూర్చుని క్షమాపణ చెప్పాలని బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు.