BR Naidu: పాట్నాలో శ్రీవారి ఆలయం... గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన బీహార్ సర్కారు
- టీటీడీ ఆలయ నిర్మాణానికి బీహార్ ఆమోదం
- 10 ఎకరాల భూమిని 99 ఏళ్ల లీజుకు కేటాయింపు
- టోకెన్ లీజు రెంటుగా కేవలం ఒక్క రూపాయి
- త్వరలో ఎంవోయూ, నిర్మాణ పనులపై చర్చలు
- కృతజ్ఞతలు తెలిపిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు
బీహార్ రాజధాని పాట్నాలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయ నిర్మాణానికి మార్గం సుగమమైంది. ఆలయ నిర్మాణం కోసం భూమిని కేటాయించేందుకు బీహార్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు పాట్నాలోని మోకామా ఖాస్ ప్రాంతంలో 10.11 ఎకరాల భూమిని కేటాయించినట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. కేవలం ఒక్క రూపాయి టోకెన్ లీజు రెంట్పై 99 సంవత్సరాల పాటు ఈ భూమిని టీటీడీకి లీజుకు ఇవ్వనున్నారు.
బీహార్ ప్రభుత్వ నిర్ణయం పట్ల బీఆర్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయంపై అభినందనలు తెలిపిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్కు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. బీహార్ ప్రభుత్వ దూరదృష్టికి, సహకారానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.
ఆలయ నిర్మాణానికి సంబంధించిన అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కోసం బీహార్ పర్యాటక శాఖ అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ను అధికారికంగా నియమించారని బీఆర్ నాయుడు వివరించారు. త్వరలోనే టీటీడీ ప్రతినిధులు సంప్రదింపులు జరిపి, నిర్మాణానికి సంబంధించిన తదుపరి చర్యలు చేపడతారని ఆయన స్పష్టం చేశారు.
బీహార్ ప్రభుత్వ నిర్ణయం పట్ల బీఆర్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయంపై అభినందనలు తెలిపిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్కు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. బీహార్ ప్రభుత్వ దూరదృష్టికి, సహకారానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.
ఆలయ నిర్మాణానికి సంబంధించిన అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కోసం బీహార్ పర్యాటక శాఖ అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ను అధికారికంగా నియమించారని బీఆర్ నాయుడు వివరించారు. త్వరలోనే టీటీడీ ప్రతినిధులు సంప్రదింపులు జరిపి, నిర్మాణానికి సంబంధించిన తదుపరి చర్యలు చేపడతారని ఆయన స్పష్టం చేశారు.