Allu Cinemas: హైదరాబాద్లో దేశంలోనే అతిపెద్ద డాల్బీ స్క్రీన్... అల్లు సినిమాస్ కొత్త ప్రయోగం
- 75 అడుగుల వెడల్పుతో సరికొత్త స్క్రీన్ టెక్నాలజీని తీసుకొస్తున్న అల్లు సినిమాస్
- 'అవతార్: ఫైర్ అండ్ యాష్' చిత్రంతో డాల్బీ స్క్రీన్ ప్రారంభం
- అత్యున్నత డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్ తో ప్రేక్షకులకు థ్రిల్
హైదరాబాద్ సినీ ప్రియులకు అల్లు సినిమాస్ ఓ శుభవార్త అందించింది. దేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమా (Dolby Cinema) స్క్రీన్ను నగరంలో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ప్రేక్షకులకు సరికొత్త వీక్షణ అనుభూతిని అందించే లక్ష్యంతో ఈ భారీ థియేటర్ను సిద్ధం చేస్తున్నారు.
ఈ డాల్బీ సినిమా స్క్రీన్ ఏకంగా 75 అడుగుల వెడల్పుతో ఉండనుంది. అత్యుత్తమ విజువల్స్ కోసం ఇందులో డాల్బీ విజన్, డాల్బీ 3డీ ప్రొజెక్షన్ టెక్నాలజీని ఉపయోగించనున్నారు. దీనికి తోడు ప్రేక్షకులను కథలో లీనమయ్యేలా చేసే డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్ను కూడా జతచేస్తున్నారు. వీక్షకులకు ఎలాంటి ఆటంకం లేకుండా సినిమాను ఆస్వాదించేందుకు 'పిచ్-బ్లాక్ స్టేడియం సీటింగ్'ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'అవతార్: ఫైర్ అండ్ యాష్' సినిమా ప్రదర్శనతో ఈ సరికొత్త డాల్బీ స్క్రీన్ను ప్రారంభించాలని నిర్వాహకులు యోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ కొత్త థియేటర్ ఎప్పుడు ప్రారంభమవుతుందా అని నగరవాసులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
హాలీవుడ్ దర్శక దిగ్గజం జేమ్స్ కామెరాన్ అద్భుత సృష్టి 'అవతార్: ఫైర్ అండ్ యాష్' డిసెంబరు 19న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ చిత్రం కోసం భారత్ లోనూ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ డాల్బీ సినిమా స్క్రీన్ ఏకంగా 75 అడుగుల వెడల్పుతో ఉండనుంది. అత్యుత్తమ విజువల్స్ కోసం ఇందులో డాల్బీ విజన్, డాల్బీ 3డీ ప్రొజెక్షన్ టెక్నాలజీని ఉపయోగించనున్నారు. దీనికి తోడు ప్రేక్షకులను కథలో లీనమయ్యేలా చేసే డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్ను కూడా జతచేస్తున్నారు. వీక్షకులకు ఎలాంటి ఆటంకం లేకుండా సినిమాను ఆస్వాదించేందుకు 'పిచ్-బ్లాక్ స్టేడియం సీటింగ్'ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'అవతార్: ఫైర్ అండ్ యాష్' సినిమా ప్రదర్శనతో ఈ సరికొత్త డాల్బీ స్క్రీన్ను ప్రారంభించాలని నిర్వాహకులు యోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ కొత్త థియేటర్ ఎప్పుడు ప్రారంభమవుతుందా అని నగరవాసులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
హాలీవుడ్ దర్శక దిగ్గజం జేమ్స్ కామెరాన్ అద్భుత సృష్టి 'అవతార్: ఫైర్ అండ్ యాష్' డిసెంబరు 19న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ చిత్రం కోసం భారత్ లోనూ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.