నేషనల్ హెరాల్డ్ కేసు: డీకే శివకుమార్కు ఈవోడబ్యూ నోటీసులు
- ఆర్థిక నేరాల విభాగం పోలీసుల నుంచి పిలుపు
- కేసులోని ఆర్థిక లావాదేవీలపై వివరణ కోరిన అధికారులు
- విచారణకు హాజరు కావాలని ఆదేశిస్తూ నోటీసులు
నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించిన ఆర్థిక వ్యవహారాల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతో ఈ కేసు చాలాకాలంగా నడుస్తోంది. ఇప్పటికే ఈ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సహా పలువురు విచారణ ఎదుర్కొన్నారు. ఇదే కేసులో భాగంగా గతంలో కూడా డీకే శివకుమార్ను ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలు ప్రశ్నించాయి.
తాజాగా ఆర్థిక నేరాల విభాగం పోలీసులు పంపిన నోటీసులతో ఈ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. కేసు విచారణలో భాగంగా కొన్ని కీలకమైన ఆర్థిక లావాదేవీలకు సంబంధించి డీకే శివకుమార్ నుంచి సమాచారం రాబట్టేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ నోటీసులపై శివకుమార్ ఎలా స్పందిస్తారు, విచారణకు ఎప్పుడు హాజరవుతారనేది ఆసక్తికరంగా మారింది. ఈ పరిణామం కర్ణాటక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.