Ayyappa devotees: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన అయ్యప్ప భక్తుల దుర్మరణం
- తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం
- ఐదుగురు ఏపీ భక్తుల మృతి
- అయ్యప్ప భక్తుల కారును ఢీకొట్టిన మరో కారు
తమిళనాడులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఐదు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఆంధ్రప్రదేశ్కు చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు ఈ ప్రమాదంలో దుర్మరణం చెందారు. రామనాథపురం జిల్లా సమీపంలో వీరు ప్రయాణిస్తున్న కారును మరో కారు బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.
వివరాల్లోకి వెళ్తే.. ఏపీకి చెందిన అయ్యప్ప భక్తులు రామేశ్వరం దర్శించుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. రామనాథపురం జిల్లా కీజక్కరై వద్ద వీరు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఎదురుగా వస్తున్న మరో కారు వేగంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు రెండు కార్లు నుజ్జునుజ్జయ్యాయి. సమాచారం ప్రకారం, కారులో ఉన్న ఐదుగురు భక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
ప్రమాదం గురించి సమాచారం అందుకున్న కీజక్కరై పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టి, గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. మృతులను విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం కోరపు కొత్తవలస, గజపతినగరం మండలం మరుపల్లి గ్రామ వాసులుగా గుర్తించారు.
వివరాల్లోకి వెళ్తే.. ఏపీకి చెందిన అయ్యప్ప భక్తులు రామేశ్వరం దర్శించుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. రామనాథపురం జిల్లా కీజక్కరై వద్ద వీరు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఎదురుగా వస్తున్న మరో కారు వేగంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు రెండు కార్లు నుజ్జునుజ్జయ్యాయి. సమాచారం ప్రకారం, కారులో ఉన్న ఐదుగురు భక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
ప్రమాదం గురించి సమాచారం అందుకున్న కీజక్కరై పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టి, గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. మృతులను విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం కోరపు కొత్తవలస, గజపతినగరం మండలం మరుపల్లి గ్రామ వాసులుగా గుర్తించారు.