ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుకు శస్త్రచికిత్స
- కిడ్నీలో రాళ్ల తొలగింపు కోసం ఆపరేషన్
- ప్రస్తుతం తాను కోలుకుంటున్నట్లు వెల్లడి
- వైద్య బృందానికి, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు
ఈ మేరకు రఘురామకృష్ణరాజు ఒక ప్రకటన విడుదల చేశారు. "ఈరోజు ఉదయం నేను కిడ్నీలో రాళ్ల తొలగింపు కోసం శస్త్రచికిత్స చేయించుకోవడం జరిగింది. ప్రస్తుతం నేను కోలుకుంటున్నాను" అని ఆయన తెలిపారు. తనకు అద్భుతమైన వైద్య సేవలు అందించిన వైద్య బృందానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.
అలాగే, తన శ్రేయస్సును ఆకాంక్షించిన మిత్రులకు, శ్రేయోభిలాషులకు కూడా రఘురామ కృతజ్ఞతలు చెప్పారు.