విలువలకే పెద్దపీట వేశారు: ఏవీఎం శరవణన్కు పవన్ నివాళి
- ప్రముఖ నిర్మాత ఏవీఎం శరవణన్ మృతిపై పవన్ కళ్యాణ్ సంతాపం
- శరవణన్ మరణ వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్న పవన్
- కుటుంబ విలువలతో కూడిన చిత్రాలు నిర్మించారని కొనియాడిన జనసేనాని
- చిరంజీవి 'పున్నమినాగు', రజనీకాంత్ 'శివాజీ' చిత్రాలను గుర్తుచేసుకున్న పవన్
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో సుదీర్ఘ చరిత్ర కలిగిన ఏవీఎం సంస్థను శరవణన్ సమర్థవంతంగా ముందుకు నడిపారని పవన్ కొనియాడారు. ఆయన కేవలం నిర్మాతగానే కాకుండా, ఎల్లప్పుడూ కుటుంబ సమేతంగా చూసే విలువలతో కూడిన, వైవిధ్యమైన కథలను ఎంచుకున్నారని గుర్తు చేసుకున్నారు.
ఈ సందర్భంగా ఏవీఎం సంస్థ నిర్మించిన పలు మైలురాయి చిత్రాలను పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. మెగాస్టార్ చిరంజీవితో నిర్మించిన ‘పున్నమినాగు’ చిత్రం తరాల అంతరం లేకుండా నేటికీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోందని పేర్కొన్నారు. అలాగే ‘సంసారం ఒక చదరంగం’, ‘ఆ ఒక్కటీ అడక్కు’, ‘లీడర్’, ‘మెరుపు కలలు’, సూపర్ స్టార్ రజనీకాంత్ ‘శివాజీ’ వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించి తెలుగు, తమిళ ప్రేక్షకులను మెప్పించారని శరవణన్ సేవలను స్మరించుకున్నారు.