IMD: తీవ్ర అల్పపీడనంగా బలహీనపడిన వాయుగుండం .. నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
- తమిళనాడులో మరో రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కొనసాగుతాయన్న ఐఎండీ
- నేడు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ
- ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన
నైరుతి బంగాళాఖాతంలోని వాయుగుండం తీవ్ర అల్పపీడనంగా బలహీనపడి పశ్చిమ దిశగా కదులుతోందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేసింది. ఇది ఈ రోజు అల్పపీడనంగా బలహీనపడుతుందని వెల్లడించింది. ఈ ప్రభావంతో తమిళనాడులో మరో రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కొనసాగుతాయని వెల్లడించింది.
ఈ క్రమంలో ఏపీలో గురువారం నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రకాశం, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
బుధవారం సాయంత్రం 5 గంటల నాటికి తిరుపతి జిల్లా తొట్టంబేడులో 47.2 మి.మీ, నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో 37.5 మి.మీ, తిరుపతి జిల్లా మన్నారుపోలూరులో 32.7 మి.మీ, చిత్తూరు జిల్లా నిండ్రలో 30 మి.మీ వర్షపాతం నమోదైందని తెలిపింది.
ఈ క్రమంలో ఏపీలో గురువారం నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రకాశం, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
బుధవారం సాయంత్రం 5 గంటల నాటికి తిరుపతి జిల్లా తొట్టంబేడులో 47.2 మి.మీ, నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో 37.5 మి.మీ, తిరుపతి జిల్లా మన్నారుపోలూరులో 32.7 మి.మీ, చిత్తూరు జిల్లా నిండ్రలో 30 మి.మీ వర్షపాతం నమోదైందని తెలిపింది.