Smriti Mandhana: 7న స్మృతి-పలాశ్ల వివాహమంటూ మళ్లీ వదంతులు!
- తండ్రి అనారోగ్యంతో వాయిదా పడిన నవంబర్ 23 నాటి వేడుక
- ఇన్స్టాగ్రామ్ నుంచి పెళ్లి పోస్టులు తొలగించడంతో పెరిగిన ఊహాగానాలు
- వదంతులను ఖండించిన స్మృతి సోదరుడు
భారత మహిళా క్రికెట్ స్టార్ స్మృతి మంధాన, సంగీత దర్శకుడు పలాశ్ ముచ్చల్ల వివాహంపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని ఆమె సోదరుడు శ్రవణ్ మంధాన స్పష్టం చేశారు. 7న వీరి వివాహం జరగనుందంటూ వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. ప్రస్తుతం పెళ్లి వాయిదాలోనే ఉందని, కొత్త తేదీ ఇంకా ఖరారు కాలేదని తెలిపారు.
నవంబర్ 23న సంగ్రామ్లో స్మృతి, పలాశ్ల వివాహం అంగరంగ వైభవంగా జరగాల్సి ఉండగా, చివరి నిమిషంలో వాయిదా పడిన విషయం తెలిసిందే. పెళ్లికి ముందు స్మృతి తండ్రి శ్రీనివాస్ మంధాన అకస్మాత్తుగా అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరారు. ఆ తర్వాత తీవ్రమైన ఒత్తిడి కారణంగా పలాశ్ కూడా ఆసుపత్రి పాలయ్యారు. ప్రస్తుతం ఇద్దరూ కోలుకున్నప్పటికీ, ఆ షాక్ నుంచి ఇరు కుటుంబాలు ఇంకా పూర్తిగా తేరుకోలేదు.
ఈ నేపథ్యంలో, పెళ్లి వాయిదా పడిన తర్వాత స్మృతి తన ఇన్స్టాగ్రామ్ ఖాతా నుంచి వివాహానికి సంబంధించిన పోస్టులన్నింటినీ తొలగించడంతో ఊహాగానాలు మరింత పెరిగాయి. దీనికి తోడు డిసెంబర్ 7న పెళ్లి జరగనుందంటూ ప్రచారం ఊపందుకుంది. ఈ వార్తలపై హిందుస్థాన్ టైమ్స్తో మాట్లాడిన శ్రవణ్.. "ఈ పుకార్లు ఎక్కడ నుంచి వస్తున్నాయో నాకు తెలియదు. ప్రస్తుతానికి పెళ్లి వాయిదా పడింది అంతే" అని స్పష్టతనిచ్చారు.
మరోవైపు, పలాశ్ తల్లి అమితా ముచ్చల్ మాట్లాడుతూ.. అంతా సర్దుకుంటుందని, పెళ్లి త్వరలోనే జరుగుతుందని (షాదీ బహోత్ జల్దీ హోగీ) ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, ఈ కష్ట సమయంలో స్మృతికి అండగా నిలిచేందుకు డబ్ల్యూబీబీఎల్ నుంచి తప్పుకున్న జెమీమా రోడ్రిగ్స్ను ప్రముఖ నటుడు సునీల్ శెట్టి ప్రశంసించారు. ఇది స్నేహానికి స్వచ్ఛమైన నిదర్శనమని కొనియాడారు.
నవంబర్ 23న సంగ్రామ్లో స్మృతి, పలాశ్ల వివాహం అంగరంగ వైభవంగా జరగాల్సి ఉండగా, చివరి నిమిషంలో వాయిదా పడిన విషయం తెలిసిందే. పెళ్లికి ముందు స్మృతి తండ్రి శ్రీనివాస్ మంధాన అకస్మాత్తుగా అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరారు. ఆ తర్వాత తీవ్రమైన ఒత్తిడి కారణంగా పలాశ్ కూడా ఆసుపత్రి పాలయ్యారు. ప్రస్తుతం ఇద్దరూ కోలుకున్నప్పటికీ, ఆ షాక్ నుంచి ఇరు కుటుంబాలు ఇంకా పూర్తిగా తేరుకోలేదు.
ఈ నేపథ్యంలో, పెళ్లి వాయిదా పడిన తర్వాత స్మృతి తన ఇన్స్టాగ్రామ్ ఖాతా నుంచి వివాహానికి సంబంధించిన పోస్టులన్నింటినీ తొలగించడంతో ఊహాగానాలు మరింత పెరిగాయి. దీనికి తోడు డిసెంబర్ 7న పెళ్లి జరగనుందంటూ ప్రచారం ఊపందుకుంది. ఈ వార్తలపై హిందుస్థాన్ టైమ్స్తో మాట్లాడిన శ్రవణ్.. "ఈ పుకార్లు ఎక్కడ నుంచి వస్తున్నాయో నాకు తెలియదు. ప్రస్తుతానికి పెళ్లి వాయిదా పడింది అంతే" అని స్పష్టతనిచ్చారు.
మరోవైపు, పలాశ్ తల్లి అమితా ముచ్చల్ మాట్లాడుతూ.. అంతా సర్దుకుంటుందని, పెళ్లి త్వరలోనే జరుగుతుందని (షాదీ బహోత్ జల్దీ హోగీ) ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, ఈ కష్ట సమయంలో స్మృతికి అండగా నిలిచేందుకు డబ్ల్యూబీబీఎల్ నుంచి తప్పుకున్న జెమీమా రోడ్రిగ్స్ను ప్రముఖ నటుడు సునీల్ శెట్టి ప్రశంసించారు. ఇది స్నేహానికి స్వచ్ఛమైన నిదర్శనమని కొనియాడారు.