ఢిల్లీలో జీఎంఆర్ అధికారులతో మంత్రి లోకేశ్ భేటీ... విశాఖలో దేశంలోనే తొలి ఏవియేషన్ ఎడ్యుసిటీ
- ఢిల్లీలో జీఎంఆర్ ఉన్నతాధికారులతో మంత్రి నారా లోకేష్ భేటీ
- విశాఖ వద్ద ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీ ఏర్పాటుపై విస్తృత చర్చ
- దేశంలోనే తొలి ఏవియేషన్ ఎడ్యుసిటీ అభివృద్ధి ప్రణాళిక ఖరారు
- ఉత్తరాంధ్రకు గేమ్ ఛేంజర్ అవుతుందని అంచనా
- సమావేశంలో పాల్గొన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
ఈ ఏవియేషన్ ఎడ్యుసిటీ ఏర్పాటుతో విశాఖ ప్రాంతం విమానయానం, ఏరోస్పేస్, రక్షణ రంగాలకు సంబంధించిన విద్య, శిక్షణలకు జాతీయ హబ్గా మారనుంది. ఇందుకోసం ప్రత్యేక నైపుణ్యం కలిగిన అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలను సైతం రాష్ట్రానికి తీసుకురానున్నారు. ఈ ప్రాజెక్ట్ ఉత్తరాంధ్ర రూపురేఖలను మార్చే గేమ్ ఛేంజర్ అవుతుందని, రాష్ట్రంలో ఏవియేషన్ క్లస్టర్ అభివృద్ధిని మరింత వేగవంతం చేస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఈ కీలక సమావేశంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో పాటు జీఎంఆర్ సంస్థ సీనియర్ అధికారులు ఎస్జీకే కిశోర్, సి.ప్రసన్న, పీయూష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.