జిలేబీలు వేసిన న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్
- అక్లాండ్లో జరిగిన సిక్కు కమ్యూనిటీ క్రీడలను ప్రారంభించిన క్రిస్టోఫర్
- జిలేబీలు వేసి ఆకట్టుకున్న ప్రధాని క్రిస్టోఫర్
- అథ్లెట్లకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని
అనంతరం అక్కడ జిలేబీలు తయారు చేస్తున్న వారి వద్దకు వెళ్లి సరదాగా జిలేబీలు వేశారు. ఆయన నవ్వుతూ కడాయిలో జిలేబీలు వేస్తుంటే అక్కడున్న వారు ఆసక్తిగా తిలకించారు. ఆ తర్వాత అక్కడున్న వారికి స్వయంగా జిలేబీలను అందించారు.
ఇందుకు సంబంధించిన వీడియోను క్రిస్టోఫర్ 'ఎక్స్' వేదికగా పంచుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక ఎంపీ రీమా నఖ్లేతో కలిసి సిక్కు క్రీడా ప్రారంభోత్సవంలో పాల్గొన్నానని ఆయన పేర్కొన్నారు. క్రీడల్లో పాల్గొంటున్న వారికి, అలాగే తన చేతి జిలేబీ తిన్న వారికి శుభాకాంక్షలు అని ఆయన రాసుకొచ్చారు.