Chiranjeevi: 'మన శంకర వరప్రసాద్ గారు'... చిరంజీవి, వెంకటేశ్ కలిసి స్టెప్పులేయడం ఇదే ఫస్ట్ టైమ్!
- ‘మన శంకర వర ప్రసాద్ గారు’ చిత్రంలో ప్రత్యేక గీతం
- తొలిసారి కలిసి డ్యాన్స్ చేస్తున్న చిరంజీవి, వెంకటేశ్
- గచ్చిబౌలిలో 500 మంది డ్యాన్సర్లతో భారీ చిత్రీకరణ
- అనిల్ రావిపూడి దర్శకత్వం, భీమ్స్ సిసిరోలియో సంగీతం
- 2026 సంక్రాంతికి సినిమా విడుదల చేసేందుకు సన్నాహాలు
మెగాస్టార్ చిరంజీవి హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న చిత్రం 'మన శంకర వర ప్రసాద్ గారు'. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా, చిత్ర యూనిట్ ఒక అదిరిపోయే అప్డేట్తో ముందుకొచ్చింది. ఈ చిత్రంలోని ఓ ప్రత్యేక గీతంలో మెగాస్టార్ చిరంజీవితో పాటు విక్టరీ వెంకటేశ్ కూడా కలిసి స్టెప్పులేస్తున్నారు. గచ్చిబౌలిలో వేసిన భారీ సెట్లో ఈ పాట చిత్రీకరణ జరుగుతోంది.
సినిమా చరిత్రలో చిరంజీవి, వెంకటేశ్ కలిసి డ్యాన్స్ చేయడం ఇదే తొలిసారి కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో అందించిన ఎలక్ట్రిఫైయింగ్ బీట్స్కు, 500 మందికి పైగా డ్యాన్సర్లతో ఈ పాటను ఎంతో గ్రాండ్గా చిత్రీకరిస్తున్నారు. సెట్లో ఇద్దరు స్టార్ హీరోల మధ్య ఉన్న స్నేహపూర్వక వాతావరణం, వారి ఎనర్జీ పాటకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.
ఈ చిత్రంలో వెంకటేశ్ ఓ కీలకమైన అతిథి పాత్రలో కనిపించనున్నారు. చిరంజీవి సరసన నయనతార హీరోయిన్గా నటిస్తుండగా, 'సైరా నరసింహారెడ్డి', 'గాడ్ఫాదర్' తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న మూడో సినిమా ఇది. త్వరలోనే చిరంజీవి, నయనతారపై చిత్రీకరించిన ఒక రొమాంటిక్ పాటను విడుదల చేసేందుకు కూడా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 2026 సంక్రాంతి కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
సినిమా చరిత్రలో చిరంజీవి, వెంకటేశ్ కలిసి డ్యాన్స్ చేయడం ఇదే తొలిసారి కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో అందించిన ఎలక్ట్రిఫైయింగ్ బీట్స్కు, 500 మందికి పైగా డ్యాన్సర్లతో ఈ పాటను ఎంతో గ్రాండ్గా చిత్రీకరిస్తున్నారు. సెట్లో ఇద్దరు స్టార్ హీరోల మధ్య ఉన్న స్నేహపూర్వక వాతావరణం, వారి ఎనర్జీ పాటకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.
ఈ చిత్రంలో వెంకటేశ్ ఓ కీలకమైన అతిథి పాత్రలో కనిపించనున్నారు. చిరంజీవి సరసన నయనతార హీరోయిన్గా నటిస్తుండగా, 'సైరా నరసింహారెడ్డి', 'గాడ్ఫాదర్' తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న మూడో సినిమా ఇది. త్వరలోనే చిరంజీవి, నయనతారపై చిత్రీకరించిన ఒక రొమాంటిక్ పాటను విడుదల చేసేందుకు కూడా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 2026 సంక్రాంతి కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.