Telangana Panchayat Elections: తెలంగాణ పంచాయతీ ఎన్నికలు... తొలి విడతకు వెల్లువెత్తిన నామినేషన్లు
- తొలి విడత పంచాయతీ ఎన్నికలకు 25 వేలకు పైగా నామినేషన్లు దాఖలు
- 4,236 గ్రామ పంచాయతీలకు కొనసాగుతున్న ఎన్నికల ప్రక్రియ
- డిసెంబర్ 11న తొలి దశ పోలింగ్, అదే రోజు ఓట్ల లెక్కింపు
- మొత్తం మూడు విడతల్లో 12,728 పంచాయతీలకు ఎన్నికలు
- కేంద్ర నిధుల కోసమే ముందుగా గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ
తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి విడతకు నామినేషన్ల పర్వం ముగిసింది. రాష్ట్రంలోని 31 జిల్లాల్లో డిసెంబర్ 11న జరగనున్న మొదటి దశ ఎన్నికల కోసం సర్పంచ్ పదవులకు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం 4,236 గ్రామ పంచాయతీలకు గాను 25,654 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. నామినేషన్ల చివరి రోజైన శనివారం ఒక్కరోజే 17,940 మంది తమ పత్రాలు సమర్పించడం విశేషం.
అటు వార్డు సభ్యుల స్థానాలకు కూడా తీవ్రమైన పోటీ నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా 37,440 వార్డులకు 82,276 నామినేషన్లు దాఖలయ్యాయని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదివారం వెల్లడించింది. ప్రస్తుతం అధికారులు నామినేషన్ల పరిశీలన ప్రక్రియ చేపట్టారు. అర్హులైన అభ్యర్థుల జాబితాను ఆదివారం రాత్రికి ప్రకటించే అవకాశం ఉంది. నామినేషన్లపై అభ్యంతరాలను డిసెంబర్ 1న స్వీకరించి, 2వ తేదీన పరిష్కరిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు డిసెంబర్ 4 చివరి తేదీ.
షెడ్యూల్ ప్రకారం తొలి విడత పోలింగ్ డిసెంబర్ 11న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుంది. అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు. రాష్ట్రంలో మొత్తం 12,728 గ్రామ పంచాయతీలకు, 1,12,242 వార్డులకు మూడు దశల్లో (డిసెంబర్ 11, 14, 17) ఎన్నికలు నిర్వహిస్తున్నారు.
15వ ఆర్థిక సంఘం నుంచి గ్రామ పంచాయతీలకు రావాల్సిన రూ.3,000 కోట్ల నిధులు 2026 మార్చి 31కి మురిగిపోనున్న నేపథ్యంలో, రాష్ట్ర కేబినెట్ ముందుగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు తుది తీర్పు వచ్చిన తర్వాతే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై నిర్ణయం తీసుకోనున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించకుండా, బీసీలకు 17.08 శాతం రిజర్వేషన్లు కేటాయించారు.
అటు వార్డు సభ్యుల స్థానాలకు కూడా తీవ్రమైన పోటీ నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా 37,440 వార్డులకు 82,276 నామినేషన్లు దాఖలయ్యాయని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదివారం వెల్లడించింది. ప్రస్తుతం అధికారులు నామినేషన్ల పరిశీలన ప్రక్రియ చేపట్టారు. అర్హులైన అభ్యర్థుల జాబితాను ఆదివారం రాత్రికి ప్రకటించే అవకాశం ఉంది. నామినేషన్లపై అభ్యంతరాలను డిసెంబర్ 1న స్వీకరించి, 2వ తేదీన పరిష్కరిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు డిసెంబర్ 4 చివరి తేదీ.
షెడ్యూల్ ప్రకారం తొలి విడత పోలింగ్ డిసెంబర్ 11న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుంది. అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు. రాష్ట్రంలో మొత్తం 12,728 గ్రామ పంచాయతీలకు, 1,12,242 వార్డులకు మూడు దశల్లో (డిసెంబర్ 11, 14, 17) ఎన్నికలు నిర్వహిస్తున్నారు.
15వ ఆర్థిక సంఘం నుంచి గ్రామ పంచాయతీలకు రావాల్సిన రూ.3,000 కోట్ల నిధులు 2026 మార్చి 31కి మురిగిపోనున్న నేపథ్యంలో, రాష్ట్ర కేబినెట్ ముందుగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు తుది తీర్పు వచ్చిన తర్వాతే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై నిర్ణయం తీసుకోనున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించకుండా, బీసీలకు 17.08 శాతం రిజర్వేషన్లు కేటాయించారు.