Revanth Reddy: హైదరాబాద్‌లో ఫుట్‌బాల్ ఫీవర్.. మైదానంలోకి సీఎం రేవంత్, లియోనెల్ మెస్సీ

Revanth Reddy and Lionel Messi to Play Football in Hyderabad
  • ప్రపంచ ఫుట్‌బాల్ స్టార్ మెస్సీతో సీఎం రేవంత్ రెడ్డి ఫుట్‌బాల్ మ్యాచ్
  • డిసెంబర్ 13న ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియంలో డ్రీమ్ మ్యాచ్
  • తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ముగింపు సందర్భంగా ప్రత్యేక ఈవెంట్
  • ఆర్ఆర్-9 టీమ్‌కు రేవంత్, ఎల్ఎం-10 టీమ్‌కు కెప్టెన్‌గా మెస్సీ 
  • ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతోనూ ఫుట్‌బాల్ ఆడనున్న లియోనెల్ మెస్సీ
ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్య ఓ అరుదైన ఫుట్‌బాల్ మ్యాచ్ జరగనుంది. డిసెంబర్ 13న హైదరాబాద్‌లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం ఈ ఆసక్తికర పోరుకు వేదిక కానుంది. ఈ వార్త క్రీడా, రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్సుకతను రేకెత్తిస్తోంది.

రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 8, 9 తేదీల్లో నిర్వహించనున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’ ముగింపు వేడుకల్లో భాగంగా ఈ డ్రీమ్ మ్యాచ్‌ను ఏర్పాటు చేశారు. ఈ మ్యాచ్‌లో సీఎం రేవంత్ రెడ్డి ‘ఆర్ఆర్-9’ జట్టు తరఫున 9వ నంబర్ జెర్సీతో బరిలోకి దిగనుండగా, లియోనెల్ మెస్సీ తన ట్రేడ్‌మార్క్ 10వ నంబర్ జెర్సీతో ‘ఎల్ఎం-10’ జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నాడు.

ఈ మ్యాచ్‌కు ముందు మెస్సీ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతో కలిసి ఫుట్‌బాల్ ఆడనున్నాడు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, అంతర్జాతీయ క్రీడాకారుడు మైదానంలో నేరుగా తలపడనుండటం ఇదే మొదటిసారి కావడంతో ఈ మ్యాచ్‌పై సర్వత ఆసక్తి నెలకొంది. ఈ ప్రత్యేక కార్యక్రమం తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు మరింత ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
Revanth Reddy
Lionel Messi
Telangana Rising Global Summit
Hyderabad Football
RR9 Team
LM10 Team
Rajiv Gandhi International Stadium
Telangana Global Summit
Football Match Hyderabad

More Telugu News