Lionel Messi: హైదరాబాద్కు మెస్సీ.. ఉప్పల్ స్టేడియంలో సందడి.. టికెట్ల అమ్మకాలు షురూ!
- హైదరాబాద్ రానున్న ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ
- వచ్చే నెల 13న ఉప్పల్ స్టేడియంలో ప్రత్యేక ఈవెంట్
- జొమాటోలో ప్రారంభమైన టికెట్ల ఆన్లైన్ విక్రయం
- రూ.1750 నుంచి రూ.30 వేల వరకు టికెట్ల ధరలు
- ఈవెంట్లో సెలబ్రిటీ మ్యాచ్, మెస్సీకి సన్మానం
ఫుట్బాల్ అభిమానులకు శుభవార్త. ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ హైదరాబాద్ రానుండటంతో నగరంలో క్రీడా సందడి మొదలైంది. వచ్చే నెల 13న ఉప్పల్ స్టేడియంలో మెస్సీ గౌరవార్థం ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్కు సంబంధించిన టికెట్ల అమ్మకాలు గురువారం నుంచి జొమాటో యాప్, వెబ్సైట్లో ప్రారంభమయ్యాయి.
ఈ కార్యక్రమంలో భాగంగా ఉప్పల్ స్టేడియంలో ఓ సెలబ్రిటీ ఫుట్బాల్ మ్యాచ్ను నిర్వహిస్తారు. అనంతరం మెస్సీని సన్మానించి, ఒక సంగీత విభావరిని కూడా ఏర్పాటు చేయనున్నారు. ఫుట్బాల్ అభిమానులు, క్రీడా ప్రియులు ఎంతో ఆసక్తిగా ఈ ఈవెంట్ కోసం ఎదురుచూస్తున్నారు.
టికెట్ల ధరలను నిర్వాహకులు రూ.1750 నుంచి రూ.30,000 వరకు నిర్ణయించారు. ప్రస్తుతం రూ.2,000, రూ.3,250, రూ.5,000, రూ.7,000, రూ.8,000, రూ.13,500 కేటగిరీల్లో టికెట్లు అందుబాటులో ఉన్నాయి. అత్యధిక ధర కలిగిన రూ.30,000 టికెట్ కొనుగోలు చేసిన వారికి ప్రత్యేక హాస్పిటాలిటీ సదుపాయాలు కల్పించనున్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఉప్పల్ స్టేడియంలో ఓ సెలబ్రిటీ ఫుట్బాల్ మ్యాచ్ను నిర్వహిస్తారు. అనంతరం మెస్సీని సన్మానించి, ఒక సంగీత విభావరిని కూడా ఏర్పాటు చేయనున్నారు. ఫుట్బాల్ అభిమానులు, క్రీడా ప్రియులు ఎంతో ఆసక్తిగా ఈ ఈవెంట్ కోసం ఎదురుచూస్తున్నారు.
టికెట్ల ధరలను నిర్వాహకులు రూ.1750 నుంచి రూ.30,000 వరకు నిర్ణయించారు. ప్రస్తుతం రూ.2,000, రూ.3,250, రూ.5,000, రూ.7,000, రూ.8,000, రూ.13,500 కేటగిరీల్లో టికెట్లు అందుబాటులో ఉన్నాయి. అత్యధిక ధర కలిగిన రూ.30,000 టికెట్ కొనుగోలు చేసిన వారికి ప్రత్యేక హాస్పిటాలిటీ సదుపాయాలు కల్పించనున్నారు.