Krishna Kanth: కంచన్ బాగ్ ఎస్ఐకి మెమో... డీజీపీ ఆఫీసు వద్ద అయ్యప్ప స్వాముల నిరసన
- అయ్యప్ప మాల ధరించాడని హైదరాబాదులో ఓ ఎస్ఐకి మెమో
- డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించిన అయ్యప్ప స్వాములు, బీజేవైఎం
- కార్యాలయంలోకి వెళ్లేందుకు యత్నం.. పోలీసులతో తోపులాట
- మెమోను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆందోళనకారుల డిమాండ్
హైదరాబాద్లోని డీజీపీ కార్యాలయం వద్ద గురువారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. విధి నిర్వహణలో ఉన్న కాంచన్బాగ్ ఎస్ఐ కృష్ణకాంత్ అయ్యప్ప మాల ధరించినందుకు ఆయనకు ఉన్నతాధికారులు మెమో జారీ చేయడాన్ని నిరసిస్తూ అయ్యప్ప స్వాములు, బీజేవైఎం కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఎస్ఐకి ఇచ్చిన మెమోను బేషరతుగా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ డీజీపీ ఆఫీస్ ముట్టడికి పిలుపునిచ్చారు.
ఈ పిలుపు మేరకు భారీ సంఖ్యలో అయ్యప్ప స్వాములు, బీజేవైఎం కార్యకర్తలు డీజీపీ కార్యాలయానికి చేరుకున్నారు. కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించగా, ముందుగానే మోహరించిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
పోలీసు యూనిఫాంపై ఇలాంటి ఆంక్షలు విధించడం హిందువుల మనోభావాలను దెబ్బతీయడమేనని ఆందోళనకారులు ఆరోపించారు. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి మెమోను ఉపసంహరించుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు పలువురు ఆందోళనకారులను అరెస్టు చేసి సమీప పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ ఘటనతో నగరంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఈ పిలుపు మేరకు భారీ సంఖ్యలో అయ్యప్ప స్వాములు, బీజేవైఎం కార్యకర్తలు డీజీపీ కార్యాలయానికి చేరుకున్నారు. కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించగా, ముందుగానే మోహరించిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
పోలీసు యూనిఫాంపై ఇలాంటి ఆంక్షలు విధించడం హిందువుల మనోభావాలను దెబ్బతీయడమేనని ఆందోళనకారులు ఆరోపించారు. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి మెమోను ఉపసంహరించుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు పలువురు ఆందోళనకారులను అరెస్టు చేసి సమీప పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ ఘటనతో నగరంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.