Raghurama Krishnam Raju: రఘురామ టార్చర్ కేసు: ఐపీఎస్ సునీల్ కుమార్కు నోటీసులు
- డిసెంబర్ 4న గుంటూరులో విచారణకు రావాలని సీఐడీ నోటీసులు
- కూటమి ప్రభుత్వం వచ్చాక రఘురామ ఫిర్యాదుతో కేసు నమోదు
- ఇప్పటికే ఈ కేసులో అప్పటి సీఐడీ అదనపు ఎస్పీ విజయపాల్ అరెస్ట్
- ప్రస్తుతం సస్పెన్షన్లో కొనసాగుతున్న పీవీ సునీల్ కుమార్
వైసీపీ ప్రభుత్వ హయాంలో సంచలనం సృష్టించిన రఘురామకృష్ణరాజు కస్టడీ హింస కేసు విచారణలో కీలక ముందడుగు పడింది. ఈ కేసులో ఏ1గా ఉన్న అప్పటి సీఐడీ డీజీ పీవీ సునీల్ కుమార్కు విచారణాధికారి నోటీసులు జారీ చేశారు. డిసెంబర్ 4న గుంటూరులోని సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని ఆ నోటీసులో ఆదేశించారు.
2021 మే 14న రఘురామకృష్ణరాజును హైదరాబాద్లోని తన నివాసంలో సీఐడీ పోలీసులు అరెస్టు చేసి గుంటూరుకు తరలించారు. ఆ రోజు రాత్రి కస్టడీలో తనపై తీవ్రంగా దాడి చేసి, హత్యాయత్నం చేశారని రఘురామ ఆరోపించారు. అయితే, అప్పటి వైసీపీ ప్రభుత్వం ఆయన ఫిర్యాదుపై కేసు నమోదు చేయలేదు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత, కూటమి అధికారంలోకి రావడంతో రఘురామ ఈ ఏడాది జులై 11న గుంటూరు నగరంపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆయన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు నాటి సీఐడీ చీఫ్ పీవీ సునీల్ కుమార్ ను ఏ 1గా, నాటి ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులును ఏ 2గా, నాటి సీఎం వైఎస్ జగన్ ను ఏ 3గా, అప్పటి సీఐడీ అదనపు ఎస్పీ విజయపాల్ ను ఏ 4గా, అప్పటి గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతిని ఏ 5గా చేరుస్తూ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ కేసులో ఇప్పటికే విజయపాల్ను విచారించి అరెస్టు చేశారు. అలానే రఘురామపై కస్టడీలో దాడి చేసిన తులసిబాబును అరెస్టు చేశారు. ప్రస్తుత విజయనగరం ఎస్పీ దామోదర్ పర్యవేక్షణలో ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సునీల్ కుమార్ పై సస్పెన్షన్ వేటు వేసింది.
2021 మే 14న రఘురామకృష్ణరాజును హైదరాబాద్లోని తన నివాసంలో సీఐడీ పోలీసులు అరెస్టు చేసి గుంటూరుకు తరలించారు. ఆ రోజు రాత్రి కస్టడీలో తనపై తీవ్రంగా దాడి చేసి, హత్యాయత్నం చేశారని రఘురామ ఆరోపించారు. అయితే, అప్పటి వైసీపీ ప్రభుత్వం ఆయన ఫిర్యాదుపై కేసు నమోదు చేయలేదు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత, కూటమి అధికారంలోకి రావడంతో రఘురామ ఈ ఏడాది జులై 11న గుంటూరు నగరంపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆయన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు నాటి సీఐడీ చీఫ్ పీవీ సునీల్ కుమార్ ను ఏ 1గా, నాటి ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులును ఏ 2గా, నాటి సీఎం వైఎస్ జగన్ ను ఏ 3గా, అప్పటి సీఐడీ అదనపు ఎస్పీ విజయపాల్ ను ఏ 4గా, అప్పటి గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతిని ఏ 5గా చేరుస్తూ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ కేసులో ఇప్పటికే విజయపాల్ను విచారించి అరెస్టు చేశారు. అలానే రఘురామపై కస్టడీలో దాడి చేసిన తులసిబాబును అరెస్టు చేశారు. ప్రస్తుత విజయనగరం ఎస్పీ దామోదర్ పర్యవేక్షణలో ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సునీల్ కుమార్ పై సస్పెన్షన్ వేటు వేసింది.