HAL: దుబాయ్ ఎయిర్ షోలో 'తేజస్' కూలిపోవడంపై స్పందించిన హెచ్ఏఎల్
- ప్రత్యేక పరిస్థితుల్లో సంభవించిన దుర్ఘటనగా అభివర్ణించిన కంపెనీ
- పైలట్ మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసిన హెచ్ఏఎల్
- విచారణ జరుపుతున్న ఏజెన్సీలకు పూర్తి సహకారం అందిస్తామని హామీ
దుబాయ్లో జరిగిన ఎయిర్ షోలో తేజస్ యుద్ధ విమానం కూలిపోయిన ఘటనపై హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) స్పందించింది. ఈ దుర్ఘటనలో పైలట్ వింగ్ కమాండర్ నమాన్ష్ స్యాల్ మృతి చెందడం పట్ల కంపెనీ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ప్రత్యేక పరిస్థితుల్లో సంభవించిన దుర్ఘటనగా ఈ ప్రమాదాన్ని కంపెనీ అభివర్ణించింది.
ప్రమాదంపై విచారణ జరుపుతున్న ఏజెన్సీలకు పూర్తి సహకారం అందిస్తామని హెచ్ఏఎల్ హామీ ఇచ్చింది. అన్ని విధాలుగా సహకరిస్తామని, ఈ విషయంలో వాటాదారులకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తామని స్పష్టం చేసింది.
హెచ్ఏఎల్ తయారు చేసిన తేలికపాటి యుద్ధ విమానం తేజస్ కూలిపోయిన నేపథ్యంలో సోమవారం నాటి ట్రేడింగ్లో కంపెనీ షేర్లు భారీగా పతనమయ్యాయి. కంపెనీ షేర్లు ఎనిమిది శాతానికి పైగా పడిపోయాయి.
ఈ ప్రమాదం తమ సంస్థ కార్యకలాపాలు, ఆర్థిక పనితీరు లేదా భవిష్యత్తు డెలివరీలపై ఎలాంటి ప్రభావం చూపబోదని హెచ్ఏఎల్ పేర్కొంది. కంపెనీ ప్రకటన వెలువడిన తర్వాత హెచ్ఏఎల్ షేర్లకు కొంతమేర నష్టాలు తగ్గాయి. ఒక దశలో 8 శాతానికి పైగా నష్టపోయిన షేరు చివరకు 3.35 శాతం నష్టంతో రూ.4,440 వద్ద ముగిసింది.
కాగా, ఈ ప్రమాదానికి గురైన తేజస్ యుద్ధ విమానం తమిళనాడులోని సూలూరు స్క్వాడ్రన్కు చెందినది. సుమారు ఎనిమిది నిమిషాల విన్యాసాలు చేసిన అనంతరం ఈ విమానం కుప్పకూలింది. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విచారణకు ఆదేశించింది.
ప్రమాదంపై విచారణ జరుపుతున్న ఏజెన్సీలకు పూర్తి సహకారం అందిస్తామని హెచ్ఏఎల్ హామీ ఇచ్చింది. అన్ని విధాలుగా సహకరిస్తామని, ఈ విషయంలో వాటాదారులకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తామని స్పష్టం చేసింది.
హెచ్ఏఎల్ తయారు చేసిన తేలికపాటి యుద్ధ విమానం తేజస్ కూలిపోయిన నేపథ్యంలో సోమవారం నాటి ట్రేడింగ్లో కంపెనీ షేర్లు భారీగా పతనమయ్యాయి. కంపెనీ షేర్లు ఎనిమిది శాతానికి పైగా పడిపోయాయి.
ఈ ప్రమాదం తమ సంస్థ కార్యకలాపాలు, ఆర్థిక పనితీరు లేదా భవిష్యత్తు డెలివరీలపై ఎలాంటి ప్రభావం చూపబోదని హెచ్ఏఎల్ పేర్కొంది. కంపెనీ ప్రకటన వెలువడిన తర్వాత హెచ్ఏఎల్ షేర్లకు కొంతమేర నష్టాలు తగ్గాయి. ఒక దశలో 8 శాతానికి పైగా నష్టపోయిన షేరు చివరకు 3.35 శాతం నష్టంతో రూ.4,440 వద్ద ముగిసింది.
కాగా, ఈ ప్రమాదానికి గురైన తేజస్ యుద్ధ విమానం తమిళనాడులోని సూలూరు స్క్వాడ్రన్కు చెందినది. సుమారు ఎనిమిది నిమిషాల విన్యాసాలు చేసిన అనంతరం ఈ విమానం కుప్పకూలింది. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విచారణకు ఆదేశించింది.