Marco Jansen: యన్సెన్ దెబ్బకు భారత్ విలవిల... తొలి ఇన్నింగ్స్ లో 201 ఆలౌట్
- దక్షిణాఫ్రికాతో రెండో టెస్టులో కష్టాల్లో టీమిండియా
- తొలి ఇన్నింగ్స్లో 201 పరుగులకే ఆలౌట్
- ఆరు వికెట్లతో భారత్ను కుప్పకూల్చిన మార్కో జాన్సెన్
- దక్షిణాఫ్రికా కన్నా 288 పరుగులు వెనుకబడిన భారత్
- సఫారీలు తొలి ఇన్నింగ్స్లో 489 పరుగుల భారీ స్కోరు
గౌహతి వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్లో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. సఫారీ బౌలర్ల ధాటికి తొలి ఇన్నింగ్స్లో భారత జట్టు కేవలం 201 పరుగులకే కుప్పకూలింది. దీంతో దక్షిణాఫ్రికాకు 288 పరుగుల భారీ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. మూడో రోజు ఆటలో టీమిండియా బ్యాటర్లు పూర్తిగా విఫలమవడంతో మ్యాచ్పై దక్షిణాఫ్రికా పట్టు బిగించింది. ప్రస్తుతం భారత్ ఫాలో ఆన్ గండంలో చిక్కుకుంది.
మార్కో యన్సెన్ కు 6 వికెట్లు
భారీ లక్ష్య ఛేదనలో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ను దక్షిణాఫ్రికా పేసర్ మార్కో యన్సెన్ తన నిప్పులు చెరిగే బంతులతో వణికించాడు. కేవలం 48 పరుగులిచ్చి 6 కీలక వికెట్లు పడగొట్టి భారత బ్యాటింగ్ ఆర్డర్ను పతనం చేశాడు. రిషభ్ పంత్ (7), రవీంద్ర జడేజా (6), నితీశ్ కుమార్ రెడ్డి (10) వంటి కీలక బ్యాటర్లతో పాటు టెయిలెండర్లను కూడా పెవిలియన్కు పంపి టీమిండియాను కోలుకోలేని దెబ్బ తీశాడు. అతనికి తోడుగా స్పిన్నర్ సైమన్ హార్మర్ 3 వికెట్లు, కేశవ్ మహారాజ్ ఒక వికెట్ తీసి భారత పతనానికి కారణమయ్యారు.
జైస్వాల్, సుందర్ పోరాటం వృథా
భారత ఇన్నింగ్స్లో ఓపెనర్ యశస్వి జైస్వాల్ (58), ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ (48) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. జైస్వాల్ ఆరంభంలో నిలకడగా ఆడి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే మిడిలార్డర్ నుంచి అతనికి సరైన సహకారం అందలేదు. కేఎల్ రాహుల్ (22), సాయి సుదర్శన్ (15) త్వరగా ఔటయ్యారు. చివర్లో వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ (134 బంతుల్లో 19) వికెట్ల పతనాన్ని అడ్డుకునేందుకు తీవ్రంగా పోరాడారు. కానీ సుందర్ అర్ధశతకానికి రెండు పరుగుల దూరంలో ఔటవడంతో భారత ఇన్నింగ్స్కు తెరపడింది.
దక్షిణాఫ్రికా భారీ స్కోరు
అంతకుముందు, టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 489 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఆల్రౌండర్ సెనురన్ ముత్తుసామి (109) అద్భుతమైన సెంచరీతో ఆకట్టుకోగా, మార్కో జాన్సెన్ (93) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. అతడు తృటిలో శతకం చేజార్చుకున్నాడు. వీరిద్దరితో పాటు స్టబ్స్ (49), వెర్రైన్ (45), బవుమా (41) కూడా రాణించారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 4 వికెట్లు పడగొట్టగా, బుమ్రా, సిరాజ్ చెరో రెండు వికెట్లు తీశారు. భారీ ఆధిక్యం సాధించిన దక్షిణాఫ్రికా.. భారత్ను ఫాఫాలో ఆన్కు ఆహ్వానించి, మ్యాచ్పై పట్టు సాధించే దిశగా అడుగులు వేస్తోంది.
మార్కో యన్సెన్ కు 6 వికెట్లు
భారీ లక్ష్య ఛేదనలో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ను దక్షిణాఫ్రికా పేసర్ మార్కో యన్సెన్ తన నిప్పులు చెరిగే బంతులతో వణికించాడు. కేవలం 48 పరుగులిచ్చి 6 కీలక వికెట్లు పడగొట్టి భారత బ్యాటింగ్ ఆర్డర్ను పతనం చేశాడు. రిషభ్ పంత్ (7), రవీంద్ర జడేజా (6), నితీశ్ కుమార్ రెడ్డి (10) వంటి కీలక బ్యాటర్లతో పాటు టెయిలెండర్లను కూడా పెవిలియన్కు పంపి టీమిండియాను కోలుకోలేని దెబ్బ తీశాడు. అతనికి తోడుగా స్పిన్నర్ సైమన్ హార్మర్ 3 వికెట్లు, కేశవ్ మహారాజ్ ఒక వికెట్ తీసి భారత పతనానికి కారణమయ్యారు.
జైస్వాల్, సుందర్ పోరాటం వృథా
భారత ఇన్నింగ్స్లో ఓపెనర్ యశస్వి జైస్వాల్ (58), ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ (48) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. జైస్వాల్ ఆరంభంలో నిలకడగా ఆడి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే మిడిలార్డర్ నుంచి అతనికి సరైన సహకారం అందలేదు. కేఎల్ రాహుల్ (22), సాయి సుదర్శన్ (15) త్వరగా ఔటయ్యారు. చివర్లో వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ (134 బంతుల్లో 19) వికెట్ల పతనాన్ని అడ్డుకునేందుకు తీవ్రంగా పోరాడారు. కానీ సుందర్ అర్ధశతకానికి రెండు పరుగుల దూరంలో ఔటవడంతో భారత ఇన్నింగ్స్కు తెరపడింది.
దక్షిణాఫ్రికా భారీ స్కోరు
అంతకుముందు, టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 489 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఆల్రౌండర్ సెనురన్ ముత్తుసామి (109) అద్భుతమైన సెంచరీతో ఆకట్టుకోగా, మార్కో జాన్సెన్ (93) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. అతడు తృటిలో శతకం చేజార్చుకున్నాడు. వీరిద్దరితో పాటు స్టబ్స్ (49), వెర్రైన్ (45), బవుమా (41) కూడా రాణించారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 4 వికెట్లు పడగొట్టగా, బుమ్రా, సిరాజ్ చెరో రెండు వికెట్లు తీశారు. భారీ ఆధిక్యం సాధించిన దక్షిణాఫ్రికా.. భారత్ను ఫాఫాలో ఆన్కు ఆహ్వానించి, మ్యాచ్పై పట్టు సాధించే దిశగా అడుగులు వేస్తోంది.