YS Jagan: సీబీఐ కోర్టులో జగన్, సునీత.. ఎదురుపడ్డా మాటల్లేవ్, పలకరింపుల్లేవ్!

YS Jagan and YS Sunitha Meet at CBI Court But Do Not Speak
  • నాంపల్లి సీబీఐ కోర్టులో ఎదురుపడిన జగన్, సునీత
  • అక్రమాస్తుల కేసు విచారణకు హాజరైన జగన్
  • వివేకా హత్య కేసు పిటిషన్‌పై విచారణకు వచ్చిన సునీత
హైదరాబాద్‌లోని నాంపల్లి సీబీఐ కోర్టులో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి ఆయన కుమార్తె డాక్టర్ సునీత, అక్రమాస్తుల కేసు విచారణ నిమిత్తం వైసీపీ అధినేత ఒకే సమయంలో కోర్టుకు హాజరయ్యారు. అయితే, కోర్టు ప్రాంగణంలో ఎదురుపడినప్పటికీ జగన్‌ తన సోదరి సునీతను పలకరించకుండానే వెళ్లిపోవడం గమనార్హం.

వివరాల్లోకి వెళితే, వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తును కొనసాగించాలన్న పిటిషన్‌పై వాదనల కోసం సునీత కోర్టుకు వచ్చారు. అదే సమయంలో, తనపై ఉన్న అక్రమాస్తుల కేసు విచారణలో భాగంగా జగన్‌ కూడా అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో కోర్టులో సునీతను చూసినప్పటికీ, జగన్‌ ఆమెతో మాట్లాడకుండా, పలకరించకుండానే ముందుకు సాగిపోయారు.

ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు కీలక వ్యక్తులు, వేర్వేరు కేసుల నిమిత్తం ఒకేసారి కోర్టుకు రావడం, కనీసం పలకరించుకోకపోవడం అక్కడున్న వారిని ఆశ్చర్యపరిచింది. వివేకా హత్య కేసులో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, బాబాయ్ కుమార్తెను జగన్ పలకరించకపోవడం రాజకీయంగానూ చర్చనీయాంశంగా మారింది. 
YS Jagan
YS Vivekananda Reddy murder case
YS Sunitha
CBI Court Hyderabad
illegal assets case
Andhra Pradesh politics
family dispute
political news
Nampally CBI Court
Viveka murder investigation

More Telugu News