Jagan Mohan Reddy: ఆరేళ్ల తర్వాత కోర్టు మెట్లెక్కిన జగన్.. విచారణకు వ్యక్తిగతంగా హాజరు

Jagan Mohan Reddy Attends CBI Court After 6 Years
  • అక్రమాస్తుల కేసులో నాంపల్లి సీబీఐ కోర్టుకు వచ్చిన జగన్
  • వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలన్న జగన్ వినతిని తిరస్కరించిన కోర్టు
  • సాధారణ ఎమ్మెల్యేగా కోర్టుకు హాజరైన మాజీ సీఎం
వైసీపీ అధినేత జగన్ సుమారు ఆరేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత సీబీఐ కోర్టు మెట్లెక్కారు. అక్రమాస్తుల కేసుకు సంబంధించి హైదరాబాద్‌లోని నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టు ఎదుట ఆయన వ్యక్తిగతంగా హాజరయ్యారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందిన జగన్, ఎన్నికల అనంతరం కూడా అదే మినహాయింపును కొనసాగించాలని కోర్టును కోరారు. అయితే, ఆయన అభ్యర్థనను కోర్టు తిరస్కరించి, విచారణకు తప్పనిసరిగా వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది.

ఈ నేపథ్యంలోనే, జగన్ ఈరోజు న్యాయమూర్తి రఘురామ్ ముందు విచారణకు హాజరయ్యారు. జగన్ రాక సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కోర్టు ప్రాంగణంలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. అక్రమాస్తుల కేసుకు సంబంధించి సీబీఐ మొత్తం 11 ఛార్జ్‌షీట్లు దాఖలు చేసింది. ఈ కేసుల్లో తమను తొలగించాలని కోరుతూ దాఖలైన సుమారు 130 డిశ్చార్జ్ పిటిషన్లు ఇంకా కోర్టులో పెండింగ్‌లోనే ఉన్నాయి.

గతంలో ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు అధికారిక కార్యక్రమాల కారణంగా జగన్ కోర్టుకు హాజరుకాలేకపోయారు. అయితే, ఇప్పుడు ఆయన సాధారణ పౌరుడిగా, సాధారణ ఎమ్మెల్యేగా విచారణను ఎదుర్కోవాల్సి వస్తోంది. కోర్టు ఆదేశాల మేరకు ఆయన క్రమం తప్పకుండా విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది.
Jagan Mohan Reddy
Jagan
CBI Court
Illegal Assets Case
Nampally CBI Court
Raghuram
YS Jagan
Andhra Pradesh Politics
Discharge Petitions

More Telugu News