ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు వస్తున్న జగన్.. కాసేపట్లో సీబీఐ కోర్టుకు వైసీపీ అధినేత
- అక్రమాస్తుల కేసులో సీబీఐ కోర్టుకు వ్యక్తిగతంగా హాజరవుతున్న జగన్
- కోర్టు ఆదేశాలతో దాదాపు ఐదేళ్ల తర్వాత విచారణకు హాజరవుతున్న మాజీ సీఎం
- నాంపల్లి కోర్టు వద్ద భారీగా పోలీసుల బందోబస్తు
దాదాపు ఐదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత జగన్ ఈ కేసులో వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావడం గమనార్హం. జగన్ చివరిసారిగా 2020 జనవరి 10న ఈ కేసులో వ్యక్తిగతంగా కోర్టుకు హాజరయ్యారు. అక్రమాస్తుల కేసుకు సంబంధించి సీబీఐ మొత్తం 11 చార్జిషీట్లు దాఖలు చేసింది. జగన్ రాక నేపథ్యంలో పోలీసులు నాంపల్లి కోర్టు వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.