Aishwarya Rai: ఐశ్వర్య రాయ్ ప్రసంగానికి రాజకీయ రంగు.. డీఎంకే నేత వ్యాఖ్యలతో చర్చ
- సత్యసాయి వేడుకల్లో ఐశ్వర్య రాయ్ స్ఫూర్తిదాయక ప్రసంగం
- ఆమెను ప్రశంసలతో ముంచెత్తిన తమిళనాడు మంత్రి మనో తంగరాజ్
- ఐశ్వర్య వ్యాఖ్యలతో ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించిన మంత్రి
ప్రముఖ బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్పై తమిళనాడు పాల, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖ మంత్రి మనో తంగరాజ్ ప్రశంసల వర్షం కురిపించారు. అదే సమయంలో ఆమె వ్యాఖ్యలను అడ్డం పెట్టుకుని ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు చేయడంతో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.
నిన్న జరిగిన శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో ఐశ్వర్య రాయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, "ప్రపంచంలో ఉన్నది ఒకే ఒక్క కులం.. అదే మానవ కులం. ప్రపంచంలో ఉన్నది ఒకే ఒక్క మతం.. అది ప్రేమ మతం" అని అన్నారు. ఆమె ప్రసంగంలోని ఈ వ్యాఖ్యలను మంత్రి మనో తంగరాజ్ ప్రత్యేకంగా ప్రస్తావించారు.
"ఐశ్వర్య రాయ్కు నా అభినందనలు. ప్రపంచంలో ఒకటే కులం ఉందని ఆమె గొంతెత్తి చాటారు" అని మంత్రి కొనియాడారు. అనంతరం ఆమె మాటలను ఉదహరిస్తూ, 2016లో ప్రధాని నరేంద్ర మోదీ ఒక అభ్యర్థి కులం గురించి మాట్లాడారని ఆరోపించారు. ఐశ్వర్య రాయ్ ఎంతో గొప్పగా మాట్లాడితే, కొందరు మాత్రం కులాల గురించి మాట్లాడతారని పరోక్షంగా విమర్శలు చేశారు.
అయితే, ఐశ్వర్య తన ప్రసంగంలో కులంతో పాటు మతం గురించి కూడా మాట్లాడారు. కానీ డీఎంకే మంత్రి మాత్రం అందులోని కులానికి సంబంధించిన అంశాన్ని మాత్రమే తీసుకుని, దానికి రాజకీయ వ్యాఖ్యానం జోడించారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక ఆధ్యాత్మిక వేదికపై ఐశ్వర్య చేసిన మానవతావాద ప్రసంగాన్ని రాజకీయ అవసరాల కోసం వాడుకుంటున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.
నిన్న జరిగిన శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో ఐశ్వర్య రాయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, "ప్రపంచంలో ఉన్నది ఒకే ఒక్క కులం.. అదే మానవ కులం. ప్రపంచంలో ఉన్నది ఒకే ఒక్క మతం.. అది ప్రేమ మతం" అని అన్నారు. ఆమె ప్రసంగంలోని ఈ వ్యాఖ్యలను మంత్రి మనో తంగరాజ్ ప్రత్యేకంగా ప్రస్తావించారు.
"ఐశ్వర్య రాయ్కు నా అభినందనలు. ప్రపంచంలో ఒకటే కులం ఉందని ఆమె గొంతెత్తి చాటారు" అని మంత్రి కొనియాడారు. అనంతరం ఆమె మాటలను ఉదహరిస్తూ, 2016లో ప్రధాని నరేంద్ర మోదీ ఒక అభ్యర్థి కులం గురించి మాట్లాడారని ఆరోపించారు. ఐశ్వర్య రాయ్ ఎంతో గొప్పగా మాట్లాడితే, కొందరు మాత్రం కులాల గురించి మాట్లాడతారని పరోక్షంగా విమర్శలు చేశారు.
అయితే, ఐశ్వర్య తన ప్రసంగంలో కులంతో పాటు మతం గురించి కూడా మాట్లాడారు. కానీ డీఎంకే మంత్రి మాత్రం అందులోని కులానికి సంబంధించిన అంశాన్ని మాత్రమే తీసుకుని, దానికి రాజకీయ వ్యాఖ్యానం జోడించారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక ఆధ్యాత్మిక వేదికపై ఐశ్వర్య చేసిన మానవతావాద ప్రసంగాన్ని రాజకీయ అవసరాల కోసం వాడుకుంటున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.