Pooja Bhatt: ఒంటరితనంపై నటి పూజా భట్ ఆసక్తికర వ్యాఖ్యలు

Pooja Bhatt Interesting comments on loneliness
  • ఒంటరిగా ఉండటం శాపం కాదన్న నటి పూజా భట్
  • అదొక పవిత్రమైన అసైన్‌మెంట్ అంటూ ఇన్‌స్టాలో పోస్ట్
  • ఇటీవలే 'బిగ్ గర్ల్స్ డోన్ట్ క్రై' సిరీస్‌తో పలకరించిన నటి
  • 'పంచాయత్' ఫేమ్ జితేంద్ర కుమార్‌కు తల్లిగా కొత్త చిత్రం
ప్రముఖ నటి, ఫిల్మ్‌మేకర్ పూజా భట్ ఒంటరితనం (సింగిల్‌హుడ్)పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒంటరిగా జీవించడాన్ని ఒక శాపంగా కాకుండా, పవిత్రమైన బాధ్యతగా చూడాలని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ ఫొటోను షేర్ చేస్తూ తన మనసులోని మాటను బయటపెట్టారు. "ఒంటరితనం అనేది శాపం కాదు. అదొక పవిత్రమైన అసైన్‌మెంట్" అని ఆమె తన పోస్టులో పేర్కొన్నారు.
 
ప్రముఖ దర్శకుడు మహేశ్ భట్ కుమార్తె, నటి అలియా భట్‌కు సోదరి అయిన పూజా భట్, 1989లో 'డాడీ' చిత్రంతో నటిగా పరిచయమయ్యారు. 'దిల్ హై కే మాన్తా నహీ', 'సడక్', 'జూనూన్', 'జఖమ్' వంటి చిత్రాలతో ఆమె స్టార్‌డమ్‌ను అందుకున్నారు. కొంతకాలం నటనకు విరామం తీసుకున్న ఆమె, ఇటీవల 'బిగ్ బాస్ ఓటీటీ 2' షోలో పాల్గొని మళ్లీ వార్తల్లో నిలిచారు. ఈ ఏడాది విడుదలైన 'బిగ్ గర్ల్స్ డోన్ట్ క్రై' అనే వెబ్ సిరీస్‌లోనూ ఆమె కీలక పాత్ర పోషించారు.
 
ప్రస్తుతం పూజా భట్ ఓ ఆసక్తికరమైన ప్రాజెక్టుకు సిద్ధమవుతున్నారు. 'పంచాయత్' వెబ్ సిరీస్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన నటుడు జితేంద్ర కుమార్‌కు తల్లిగా ఆమె ఓ సినిమాలో నటించనున్నారు. భారతదేశంలో పావురాలను పెంచి, వాటిని ఎగరవేసే సంస్కృతి నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమా చిత్రీకరణ వచ్చే ఏడాది ప్రారంభం కానుంది.
Pooja Bhatt
Pooja Bhatt singlehood
Pooja Bhatt Instagram
Mahesh Bhatt
Alia Bhatt
Big Boss OTT 2
Big Girls Dont Cry
Jitendra Kumar
Panchayat web series
Bollywood actress

More Telugu News