Priyanka Chopra: 'వారణాసి' డబ్బింగ్ పై క్లారిటీ ఇచ్చిన ప్రియాంక చోప్రా
- వారణాసి' చిత్రంలో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పనున్న ప్రియాంక చోప్రా
- తెలుగు ప్రేక్షకుల కోసమే ఈ నిర్ణయమన్న గ్లోబల్ స్టార్
- తెలుగు నేర్చుకోవడంలో రాజమౌళి సహాయం తీసుకుంటున్నానని వెల్లడి
- మహేశ్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ఈ భారీ పాన్-ఇండియా చిత్రం
- చాలా ఏళ్ల తర్వాత తెలుగు ప్రేక్షకులను పలకరించనున్న ప్రియాంక
గ్లోబల్ స్టార్ ప్రియాంకా చోప్రా, తాను నటిస్తున్న భారీ చిత్రం ‘వారణాసి’లో తన పాత్రకు తెలుగులో స్వయంగా డబ్బింగ్ చెప్పనున్నట్లు స్పష్టం చేశారు. సోషల్ మీడియా వేదికగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ ఈ విషయాన్ని ఆమె ధృవీకరించారు. తెలుగు ప్రేక్షకులపై ఉన్న అభిమానంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ ప్రకటనతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
తెలుగు భాష నేర్చుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తున్నానని, దీని కోసం దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి సహాయం తీసుకుంటున్నానని ప్రియాంకా ఇటీవల ఓ సందర్భంలో వెల్లడించారు. "ప్రమోషన్ కార్యక్రమాల్లో తెలుగు మాట్లాడేటప్పుడు ఏమైనా తప్పులు దొర్లితే క్షమించాలి" అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కెరీర్ ఆరంభంలో 'అపురూపం' అనే తెలుగు చిత్రంలో నటించినప్పటికీ, అది విడుదల కాలేదు. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఆమె ‘వారణాసి’తో తెలుగు ప్రేక్షకులను నేరుగా పలకరించబోతున్నారు.
రాజమౌళి దర్శకత్వంలో అత్యంత భారీస్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సూపర్స్టార్ మహేశ్ బాబు ‘రుద్ర’ అనే శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నారు. ప్రియాంకా చోప్రా ‘మందాకిని’ పాత్ర పోషిస్తుండగా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ‘కుంభ’ అనే ప్రతినాయక పాత్రలో నటిస్తున్నారు. ప్రియాంక సొంతంగా డబ్బింగ్ చెప్పనుండటంతో ఈ సినిమా తెలుగు వెర్షన్పై ప్రత్యేక ఆసక్తి నెలకొంది.
తెలుగు భాష నేర్చుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తున్నానని, దీని కోసం దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి సహాయం తీసుకుంటున్నానని ప్రియాంకా ఇటీవల ఓ సందర్భంలో వెల్లడించారు. "ప్రమోషన్ కార్యక్రమాల్లో తెలుగు మాట్లాడేటప్పుడు ఏమైనా తప్పులు దొర్లితే క్షమించాలి" అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కెరీర్ ఆరంభంలో 'అపురూపం' అనే తెలుగు చిత్రంలో నటించినప్పటికీ, అది విడుదల కాలేదు. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఆమె ‘వారణాసి’తో తెలుగు ప్రేక్షకులను నేరుగా పలకరించబోతున్నారు.
రాజమౌళి దర్శకత్వంలో అత్యంత భారీస్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సూపర్స్టార్ మహేశ్ బాబు ‘రుద్ర’ అనే శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నారు. ప్రియాంకా చోప్రా ‘మందాకిని’ పాత్ర పోషిస్తుండగా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ‘కుంభ’ అనే ప్రతినాయక పాత్రలో నటిస్తున్నారు. ప్రియాంక సొంతంగా డబ్బింగ్ చెప్పనుండటంతో ఈ సినిమా తెలుగు వెర్షన్పై ప్రత్యేక ఆసక్తి నెలకొంది.