తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అరెస్టు
- సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ నిరసన
- సింగరేణి భవన్ ఎదుట ఆందోళనకు దిగిన కవిత
- కవితను అరెస్టు చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్కు తరలించిన పోలీసులు
సింగరేణి సమస్యలను పరిష్కరించలేని అసమర్థ ప్రభుత్వమని ఆమె విమర్శించారు. కార్మికుల కోసం మెడికల్ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో కవితతో పాటు బైఠాయించిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని నాంపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. సింగరేణి భవన్ను కవిత ముట్టడిస్తుందన్న సమాచారంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.