BSNL: కస్టమర్లకు షాక్ ఇచ్చిన బీఎస్ఎన్ఎల్... వినియోగదారుల ఆగ్రహం
- రూ.107 ప్రీపెయిడ్ ప్లాన్ వ్యాలిడిటీని తగ్గించిన బీఎస్ఎన్ఎల్
- 28 రోజుల నుంచి 22 రోజులకు కుదింపు
- ఇది 20% టారిఫ్ పెంపుతో సమానమంటున్న నిపుణులు
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన ప్రీపెయిడ్ వినియోగదారులకు షాక్ ఇచ్చింది. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా నిశ్శబ్దంగా తన పాపులర్ ప్లాన్లలో ఒకటైన రూ.107 ప్యాక్ వ్యాలిడిటీని తగ్గించింది. ప్రైవేట్ టెలికాం సంస్థల బాటలోనే బీఎస్ఎన్ఎల్ కూడా పయనించడంపై కస్టమర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
తాజా మార్పుల ప్రకారం, రూ.107 ప్లాన్పై గతంలో లభించిన 28 రోజుల వ్యాలిడిటీని ఇప్పుడు 22 రోజులకు కుదించారు. వాస్తవానికి, కొన్నేళ్ల క్రితం వరకు ఇదే ప్లాన్కు 35 రోజుల వ్యాలిడిటీ ఉండేది. దశలవారీగా వ్యాలిడిటీని తగ్గిస్తూ రావడంతో, ధర పెంచకపోయినా వినియోగదారులపై పరోక్షంగా భారం మోపినట్లయ్యింది.
ప్లాన్ ధరను మార్చకుండా వ్యాలిడిటీని తగ్గించడం కూడా ఒకరకమైన టారిఫ్ పెంపు అవుతుందని టెక్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుత మార్పు దాదాపు 20 శాతానికి పైగా టారిఫ్ పెంపుతో సమానమని వారు అభిప్రాయపడుతున్నారు. బీఎస్ఎన్ఎల్ తీసుకున్న ఈ నిర్ణయంపై సోషల్ మీడియాలోనూ, ఇతర వేదికలపైనా వినియోగదారులు విమర్శలు గుప్పిస్తున్నారు. తక్షణమే పాత వ్యాలిడిటీని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు.
తాజా మార్పుల ప్రకారం, రూ.107 ప్లాన్పై గతంలో లభించిన 28 రోజుల వ్యాలిడిటీని ఇప్పుడు 22 రోజులకు కుదించారు. వాస్తవానికి, కొన్నేళ్ల క్రితం వరకు ఇదే ప్లాన్కు 35 రోజుల వ్యాలిడిటీ ఉండేది. దశలవారీగా వ్యాలిడిటీని తగ్గిస్తూ రావడంతో, ధర పెంచకపోయినా వినియోగదారులపై పరోక్షంగా భారం మోపినట్లయ్యింది.
ప్లాన్ ధరను మార్చకుండా వ్యాలిడిటీని తగ్గించడం కూడా ఒకరకమైన టారిఫ్ పెంపు అవుతుందని టెక్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుత మార్పు దాదాపు 20 శాతానికి పైగా టారిఫ్ పెంపుతో సమానమని వారు అభిప్రాయపడుతున్నారు. బీఎస్ఎన్ఎల్ తీసుకున్న ఈ నిర్ణయంపై సోషల్ మీడియాలోనూ, ఇతర వేదికలపైనా వినియోగదారులు విమర్శలు గుప్పిస్తున్నారు. తక్షణమే పాత వ్యాలిడిటీని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు.