Janasena: జీహెచ్ఎంసీ ఎన్నికలకు సిద్ధం: జనసేన

Janasena Ready for GHMC Elections
  • గ్రేటర్ ఎన్నికలపై జనసేన ఫోకస్
  • పోటీకి సిద్ధమన్న గ్రేటర్ హైదరాబాద్ జనసేన అధ్యక్షుడు రాజలింగం
  • కూకట్‌పల్లిలో పార్టీ నేతలతో కీలక సమావేశం
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లో పోటీ చేసేందుకు జనసేన పార్టీ సిద్ధంగా ఉందని ఆ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు రాజలింగం స్పష్టం చేశారు. కూకట్‌పల్లి నియోజకవర్గానికి చెందిన ముఖ్య నాయకులు, కార్యకర్తలతో కేపీహెచ్‌బీలో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జనసేన రాష్ట్ర ఇన్‌చార్జి నేమూరి శంకర్‌గౌడ్‌ మాట్లాడుతూ, పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంపై నాయకులు దృష్టి సారించాలన్నారు. కార్యకర్తల సమీకరణ ద్వారా పార్టీని ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లాలని ఆయన సూచించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలను ఎదుర్కొనేందుకు ఇప్పటి నుంచే సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి ప్రేమ్‌కుమార్‌, వీర మహిళ చైర్మన్‌ కావ్య, ప్రధాన కార్యదర్శి దామోదర్‌రెడ్డితో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 
Janasena
GHMC Elections
Greater Hyderabad Municipal Corporation
Rajalingam
Nemuri Shankar Goud
Kukatpally
Telangana Politics
Hyderabad Politics

More Telugu News