Ravichandran Smaran: ఎవరీ రవిచంద్రన్ స్మరణ్..? యువ క్రికెటర్ పై శశి థరూర్ ప్రశంసలు
- రంజీ ట్రోఫీలో అజేయంగా 227 పరుగులు చేసిన స్మరన్
- గత మూడు మ్యాచ్ల్లోనే అతనికి ఇది రెండో డబుల్ సెంచరీ
- ఐపీఎల్లో రాణిస్తే తప్ప సెలక్టర్లు గుర్తించరంటూ థరూర్ వ్యాఖ్య
- ఐపీఎల్లో స్మరన్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు
కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశి థరూర్... కర్ణాటక యువ బ్యాటింగ్ సంచలనం రవిచంద్రన్ స్మరణ్ పై ప్రశంసల వర్షం కురిపించారు. దేశవాళీ క్రికెట్లో అద్భుత ప్రదర్శన చేస్తున్నా గుర్తింపునకు నోచుకోని ఎందరో ప్రతిభావంతులు ఉన్నారని, స్మరణ్ కూడా అలాంటి కోవకు చెందినవాడేనని ఆయన అన్నారు. ఐపీఎల్లో రాణిస్తే తప్ప ఇలాంటి ఆటగాళ్లను సెలక్టర్లు గుర్తించరంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
సోమవారం చండీగఢ్ తో జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచ్లో 22 ఏళ్ల స్మరణ్ అద్భుతమైన డబుల్ సెంచరీతో కదం తొక్కాడు. ఒక దశలో 64 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన కర్ణాటకను తన అద్భుత ఇన్నింగ్స్తో ఆదుకున్నాడు. కెరీర్లోనే అత్యుత్తమ ప్రదర్శనగా 362 బంతుల్లో 16 ఫోర్లు, 2 సిక్సర్లతో 227 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీంతో కర్ణాటక 547/8 పరుగుల భారీ స్కోరు వద్ద ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది.
ఈ ప్రదర్శనపై స్పందించిన థరూర్, "ఇది అద్భుతం. ఇలాంటి ప్రతిభావంతుల గురించి బయటి ప్రపంచానికి తెలియాలి. ఐపీఎల్లో రాణించే వరకు సెలక్టర్లు వీరిని గుర్తించరనడంలో సందేహం లేదు" అని 'ఎక్స్' వేదికగా పేర్కొన్నారు.
గత మూడు మ్యాచ్ల్లో స్మరణ్ కు ఇది రెండో డబుల్ సెంచరీ కావడం విశేషం. ఇంతకుముందు కేరళపై 220*, పంజాబ్పై 203 పరుగులు సాధించాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు 119 సగటుతో 595 పరుగులు చేశాడు. ఐపీఎల్ 2025 కోసం సన్రైజర్స్ హైదరాబాద్ స్మరణ్ ను కొనుగోలు చేసినప్పటికీ, అతనికి ఇంకా అరంగేట్రం చేసే అవకాశం రాలేదు. కానీ, దేశవాళీ క్రికెట్లో అతని నిలకడైన ప్రదర్శన అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.
సోమవారం చండీగఢ్ తో జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచ్లో 22 ఏళ్ల స్మరణ్ అద్భుతమైన డబుల్ సెంచరీతో కదం తొక్కాడు. ఒక దశలో 64 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన కర్ణాటకను తన అద్భుత ఇన్నింగ్స్తో ఆదుకున్నాడు. కెరీర్లోనే అత్యుత్తమ ప్రదర్శనగా 362 బంతుల్లో 16 ఫోర్లు, 2 సిక్సర్లతో 227 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీంతో కర్ణాటక 547/8 పరుగుల భారీ స్కోరు వద్ద ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది.
ఈ ప్రదర్శనపై స్పందించిన థరూర్, "ఇది అద్భుతం. ఇలాంటి ప్రతిభావంతుల గురించి బయటి ప్రపంచానికి తెలియాలి. ఐపీఎల్లో రాణించే వరకు సెలక్టర్లు వీరిని గుర్తించరనడంలో సందేహం లేదు" అని 'ఎక్స్' వేదికగా పేర్కొన్నారు.
గత మూడు మ్యాచ్ల్లో స్మరణ్ కు ఇది రెండో డబుల్ సెంచరీ కావడం విశేషం. ఇంతకుముందు కేరళపై 220*, పంజాబ్పై 203 పరుగులు సాధించాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు 119 సగటుతో 595 పరుగులు చేశాడు. ఐపీఎల్ 2025 కోసం సన్రైజర్స్ హైదరాబాద్ స్మరణ్ ను కొనుగోలు చేసినప్పటికీ, అతనికి ఇంకా అరంగేట్రం చేసే అవకాశం రాలేదు. కానీ, దేశవాళీ క్రికెట్లో అతని నిలకడైన ప్రదర్శన అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.