టీటీడీ పరకామణి కేసు... కీలక ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు
- నిందితులు, సాక్షులకు భద్రత కల్పించాలని హైకోర్టు ఉత్తర్వులు
- ఏపీ సీఐడీ డీజీకి స్పష్టమైన ఆదేశాల జారీ
- సీవీఎస్వో సతీశ్ కుమార్ అనుమానాస్పద మృతి నేపథ్యంలో కీలక పరిణామం
ఈ కేసులో నిందితుడిగా ఉన్న రవికుమార్తో పాటు ఇతర సాక్షులందరికీ పూర్తిస్థాయి భద్రత కల్పించాలని ఏపీ సీఐడీ డీజీని హైకోర్టు ఆదేశించింది. కేసు విచారణ ముగిసేంత వరకు వారికి ఎలాంటి హాని కలగకుండా రక్షణ చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది. విచారణ సమయంలో అనవసర ఇబ్బందులు తలెత్తకుండా, సాక్షుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది.
పరకామణి చోరీ కేసు విచారణ జరుగుతున్న సమయంలోనే కొన్ని రోజుల క్రితం సతీశ్ కుమార్ మరణించడం తీవ్ర కలకలం రేపింది. మొదట అనుమానాస్పద మృతిగా నమోదైన ఈ కేసును, ఆ తర్వాత హత్య కేసుగా మార్చిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో సాక్షుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ హైకోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది. కేసు తదుపరి విచారణను డిసెంబర్ 2వ తేదీకి వాయిదా వేసింది.