రజనీకాంత్, బాలకృష్ణలకు అరుదైన గౌరవం.. కీలక ప్రకటన చేసిన కేంద్ర ప్రభుత్వం
- రజనీకాంత్, బాలకృష్ణలకు ఇఫిలో అరుదైన గౌరవం
- 50 ఏళ్ల సినీ ప్రస్థానానికి గుర్తింపుగా ప్రత్యేక సత్కారం
- గోవా ఫిల్మ్ ఫెస్టివల్లో సన్మానించనున్నట్టు కేంద్రం ప్రకటన
గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్తో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మురుగన్ ఈ వివరాలను వెల్లడించారు. "రజనీకాంత్, బాలకృష్ణ తమ సినీ ప్రయాణంలో 50 ఏళ్లు పూర్తి చేసుకోవడం భారతీయ సినిమా చరిత్రలో ఒక మైలురాయి. వారి అద్భుతమైన నటన, ప్రజాదరణతో దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరించారు. వారి కృషికి గుర్తింపుగా ఇఫి ముగింపు వేడుకల్లో వారిని సన్మానిస్తాం" అని ఆయన తెలిపారు. ప్రతిష్ఠాత్మక ఇఫి వేడుకలు నవంబర్ 20 నుంచి 28 వరకు గోవాలో జరగనున్నాయి.
1975లో ‘అపూర్వ రాగంగళ్’ చిత్రంతో నటుడిగా ప్రయాణం మొదలుపెట్టిన రజనీకాంత్, తనదైన స్టైల్తో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. మరోవైపు, బాలకృష్ణ నటుడిగా రాణిస్తూనే సామాజిక సేవలోనూ తనదైన ముద్ర వేశారు. ప్రస్తుతం ఆయన వరుస సినిమాలతో బిజీగా ఉండగా, 'అఖండ 2' విడుదలకు సిద్ధమవుతోంది.