Arjun Tendulkar: ముంబై ఇండియన్స్ ను వీడి కొత్త జట్టులోకి టెండూల్కర్ తనయుడు
- ముంబై ఇండియన్స్ను వీడిన అర్జున్ టెండూల్కర్
- లక్నో సూపర్ జెయింట్స్కు రూ. 30 లక్షలకు ట్రేడ్
- తన ప్రయాణంపై భావోద్వేగ పోస్ట్ పెట్టిన అర్జున్
- 'లవ్ యూ' అంటూ స్పందించిన సోదరి సారా
- అర్జున్కు శుభాకాంక్షలు తెలిపిన ముంబై ఇండియన్స్
- ముంబై జట్టులోకి తిరిగి వచ్చిన మయాంక్ మార్కండే
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు, యువ ఆల్రౌండర్ అర్జున్ టెండూల్కర్ ఐపీఎల్లో మరో జట్టుతో తన ప్రయాణాన్ని ప్రారంభించనున్నాడు. ఐపీఎల్ 2026 సీజన్కు ముందు జరిగిన ట్రేడింగ్లో అతడిని ముంబై ఇండియన్స్ (ఎమ్ఐ)... లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ)కు బదిలీ చేసింది. ఈ ట్రేడ్ అర్జున్ ప్రస్తుత ధర అయిన రూ. 30 లక్షలకే జరిగింది.
2021 నుంచి ముంబై ఇండియన్స్ జట్టులో ఉన్న అర్జున్, 2023లో ఐపీఎల్లోకి అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు 5 మ్యాచ్లు ఆడి 3 వికెట్లు పడగొట్టాడు. జట్టును వీడుతున్న సందర్భంగా అర్జున్ సోషల్ మీడియాలో ఓ భావోద్వేగ పోస్ట్ పెట్టాడు. "ఈ జ్ఞాపకాలకు ధన్యవాదాలు. ముంబై జట్టులో భాగం కావడం గౌరవంగా భావిస్తున్నాను. త్వరలోనే లక్నో సూపర్ జెయింట్స్ జట్టులో చేరేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను" అని పేర్కొన్నాడు.
అర్జున్ పెట్టిన పోస్ట్పై అతని సోదరి సారా టెండూల్కర్ 'లవ్ యూ' అని కామెంట్ చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. మరోవైపు, ముంబై ఇండియన్స్ యాజమాన్యం కూడా అర్జున్కు శుభాకాంక్షలు తెలిపింది. "మా కుటుంబంలో విలువైన సభ్యుడిగా ఉన్నందుకు ధన్యవాదాలు. నీ తదుపరి ప్రయాణం విజయవంతం కావాలని కోరుకుంటున్నాం. నీ అభివృద్ధిలో భాగమైనందుకు గర్వంగా ఉంది" అని ఓ ప్రకటనలో పేర్కొంది.
ఇదే సమయంలో ముంబై ఇండియన్స్ మరో ట్రేడ్ను పూర్తి చేసింది. కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) నుంచి లెగ్ స్పిన్నర్ మయాంక్ మార్కండేను రూ. 30 లక్షలకు తిరిగి జట్టులోకి తీసుకుంది. మార్కండే గతంలో 2018, 2019, 2022 సీజన్లలో ముంబైకి ప్రాతినిధ్యం వహించాడు.
2021 నుంచి ముంబై ఇండియన్స్ జట్టులో ఉన్న అర్జున్, 2023లో ఐపీఎల్లోకి అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు 5 మ్యాచ్లు ఆడి 3 వికెట్లు పడగొట్టాడు. జట్టును వీడుతున్న సందర్భంగా అర్జున్ సోషల్ మీడియాలో ఓ భావోద్వేగ పోస్ట్ పెట్టాడు. "ఈ జ్ఞాపకాలకు ధన్యవాదాలు. ముంబై జట్టులో భాగం కావడం గౌరవంగా భావిస్తున్నాను. త్వరలోనే లక్నో సూపర్ జెయింట్స్ జట్టులో చేరేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను" అని పేర్కొన్నాడు.
అర్జున్ పెట్టిన పోస్ట్పై అతని సోదరి సారా టెండూల్కర్ 'లవ్ యూ' అని కామెంట్ చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. మరోవైపు, ముంబై ఇండియన్స్ యాజమాన్యం కూడా అర్జున్కు శుభాకాంక్షలు తెలిపింది. "మా కుటుంబంలో విలువైన సభ్యుడిగా ఉన్నందుకు ధన్యవాదాలు. నీ తదుపరి ప్రయాణం విజయవంతం కావాలని కోరుకుంటున్నాం. నీ అభివృద్ధిలో భాగమైనందుకు గర్వంగా ఉంది" అని ఓ ప్రకటనలో పేర్కొంది.
ఇదే సమయంలో ముంబై ఇండియన్స్ మరో ట్రేడ్ను పూర్తి చేసింది. కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) నుంచి లెగ్ స్పిన్నర్ మయాంక్ మార్కండేను రూ. 30 లక్షలకు తిరిగి జట్టులోకి తీసుకుంది. మార్కండే గతంలో 2018, 2019, 2022 సీజన్లలో ముంబైకి ప్రాతినిధ్యం వహించాడు.