Ravindra Jadeja: టెస్టుల్లో రవీంద్ర జడేజా అరుదైన ఘనత.. దిగ్గజాల క్లబ్లో చోటు
- టెస్ట్ క్రికెట్లో రవీంద్ర జడేజా అరుదైన ఘనత
- 4000 రన్స్, 300 వికెట్లు తీసిన నాలుగో క్రికెటర్గా రికార్డ్
- కపిల్ దేవ్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో భారత ఆటగాడు
- ఇదే మ్యాచ్లో 4000 పరుగుల మైలురాయి దాటిన కేఎల్ రాహుల్
భారత స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా టెస్ట్ క్రికెట్లో ఓ అరుదైన మైలురాయిని అందుకున్నాడు. 4000 పరుగులు, 300 వికెట్లు సాధించిన దిగ్గజాల జాబితాలో చోటు దక్కించుకున్నాడు. దక్షిణాఫ్రికాతో ఈడెన్ గార్డెన్స్లో జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఆటలో ఈ ఘనతను సాధించాడు. తన ఇన్నింగ్స్లో 10వ పరుగు పూర్తి చేసిన జడేజా, టెస్టుల్లో 4000 పరుగుల మార్కును దాటాడు.
దీంతో టెస్ట్ క్రికెట్ చరిత్రలో 4000 పరుగులు, 300కు పైగా వికెట్లు తీసిన నాలుగో ఆటగాడిగా జడేజా నిలిచాడు. ఇంతకు ముందు ఈ జాబితాలో దిగ్గజాలు ఇయాన్ బోథమ్, కపిల్ దేవ్, డానియల్ వెటోరి మాత్రమే ఉన్నారు. కేవలం 87 టెస్టుల్లోనే జడేజా ఈ ఘనత సాధించడం విశేషం. అత్యంత వేగంగా ఈ మైలురాయిని అందుకున్న ఆటగాళ్ల జాబితాలో ఇయాన్ బోథమ్ (72 టెస్టులు) తర్వాత రెండో స్థానంలో నిలిచాడు. జడేజా తన టెస్ట్ కెరీర్లో ఇప్పటివరకు 6 సెంచరీలు, 27 అర్ధ సెంచరీలతో పాటు 331 వికెట్లు పడగొట్టాడు.
రాహుల్ 4000 పరుగుల మైలురాయి
ఇదే మ్యాచ్లో మరో ఇద్దరు భారత ఆటగాళ్లు కూడా కీలక మైలురాళ్లు అందుకున్నారు. కేఎల్ రాహుల్ టెస్టుల్లో 4000 పరుగుల మార్కును దాటి, ఈ ఘనత సాధించిన 18వ భారత బ్యాటర్గా నిలిచాడు. మరోవైపు వికెట్ కీపర్ రిషభ్ పంత్ ఓ అద్భుతమైన రికార్డు సృష్టించాడు. టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు (91) బాదిన భారత ఆటగాడిగా వీరేంద్ర సెహ్వాగ్ను అధిగమించి అగ్రస్థానానికి చేరాడు.
దీంతో టెస్ట్ క్రికెట్ చరిత్రలో 4000 పరుగులు, 300కు పైగా వికెట్లు తీసిన నాలుగో ఆటగాడిగా జడేజా నిలిచాడు. ఇంతకు ముందు ఈ జాబితాలో దిగ్గజాలు ఇయాన్ బోథమ్, కపిల్ దేవ్, డానియల్ వెటోరి మాత్రమే ఉన్నారు. కేవలం 87 టెస్టుల్లోనే జడేజా ఈ ఘనత సాధించడం విశేషం. అత్యంత వేగంగా ఈ మైలురాయిని అందుకున్న ఆటగాళ్ల జాబితాలో ఇయాన్ బోథమ్ (72 టెస్టులు) తర్వాత రెండో స్థానంలో నిలిచాడు. జడేజా తన టెస్ట్ కెరీర్లో ఇప్పటివరకు 6 సెంచరీలు, 27 అర్ధ సెంచరీలతో పాటు 331 వికెట్లు పడగొట్టాడు.
రాహుల్ 4000 పరుగుల మైలురాయి
ఇదే మ్యాచ్లో మరో ఇద్దరు భారత ఆటగాళ్లు కూడా కీలక మైలురాళ్లు అందుకున్నారు. కేఎల్ రాహుల్ టెస్టుల్లో 4000 పరుగుల మార్కును దాటి, ఈ ఘనత సాధించిన 18వ భారత బ్యాటర్గా నిలిచాడు. మరోవైపు వికెట్ కీపర్ రిషభ్ పంత్ ఓ అద్భుతమైన రికార్డు సృష్టించాడు. టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు (91) బాదిన భారత ఆటగాడిగా వీరేంద్ర సెహ్వాగ్ను అధిగమించి అగ్రస్థానానికి చేరాడు.